శ్రీపతి ల్యాబ్‌లో పేలిన రియాక్టర్

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద గల శ్రీపతి ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్‌లో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో భయంతో సిబ్బంది, చుట్టు పక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ప్రమాదం నుంచి కార్మికులు సురక్షితంగా బయట పడ్డారు. హైదరాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవేపై పొగ వ్యాపించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

రియాక్టర్ పేలిన సమయంలో కార్మికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో హుటాహుటిన కంపెనీకి చేరుకొని ప్రమాద తీవ్రత పెరగకుండా చర్యలు చేపట్టారు. పోలీసుల, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా కంపెనీలోని కార్మికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.