తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు

ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ : సీఎం రేవంత్ రెడ్డి

అర్హులైన వారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన

హైదరాబాద్‌: కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పౌరసరఫరా శాఖ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాటు చేయాలి ఆదేశించిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఎన్నికల కోడ్ అమల్లో లేని

కొత్త కార్డులకు సంబంధించి డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి

మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మీ-సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న నేపథ్యంలో.. ప్రజలు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా అవగాహన కల్పించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. కాగా, రాష్ట్రంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని.. ఆ జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా.. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పలు డిజైన్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు.

ఆ జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో రేషన్ కార్డులు

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో.. ఎలక్షన్ కోడ్ ఉన్న జిల్లాలు మినహాయించి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో మొదటగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. కాగా.. ఆయా జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

Related Posts
సోన్‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని
P M Modi inaugurated the Sonamarg Tunnel

న్యూఢిల్లీ : శ్రీనగర్-లడఖ్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా సోన్‌మార్గ్‌లోని జెడ్‌-మోర్ టన్నెల్‌ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సోమవారం కశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని Read more

Delhi budget : బడ్జెట్‌పై ప్రజల నుంచి 10 వేల సూచనలు అందాయి: సీఎం రేఖాగుప్తా
10,000 suggestions received from people on budget.. CM Rekha Gupta

Delhi budget : ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ‘ఖీర్’ వేడుకతో ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి రేఖాగుప్తా పేర్కొన్నారు. అయితే త్వరలో ప్రవేశపెట్టనున్న వికసిత్‌ ఢిల్లీ బడ్జెట్‌ Read more

నిగంబోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
నిగంబోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అంత్యక్రియలు, భారత ఆర్థిక సంస్కరణల నాయకుడిగా ప్రసిద్ధి చెందిన మన్మోహన్ సింగ్, శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీని నిగంబోధ్ ఘాట్‌లో Read more

ఆరోగ్యకరమైన మిరప పువ్వులు, సంతోషకరమైన రైతులకు భరోసా అందిస్తున్న గోద్రెజ్ రాషిన్‌బాన్
Godrej Rashinban ensures healthy chilli flowers and happy farmers

హైదరాబాద్‌: మిరప మొక్కలో కీలకమైన ఆర్థిక భాగమైనందున, మిరప సాగులో పువ్వులు విజయానికి అత్యంత కీలకం. ఈ కీలకమైన వాస్తవాన్ని గుర్తించి, ఈ కీలకమైన మొక్కల నిర్మాణాలను Read more