రామసేతు కాల్పనికం కాదు..ఇది వాస్తవ నిర్మాణం: ఇస్రో వెల్లడి

Ram Setu is not a function..it is a real structure: ISRO reveals

న్యూఢిల్లీః భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కాల్పనికం కాదని ఇస్రో పేర్కొంది. ఇది వాస్తవ నిర్మాణమని స్పష్టం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ – 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్‌ను విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకూ విస్తరించి ఉంది. దీనిని సున్నపురాతితో నిర్మించినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వంతెన 99.98 శాతం నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

కాగా, రామసేతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణకాలంలోనే నిర్మించిన వారధి అని భారతీయుల విశ్వాసం. దీన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ పరిశోధన సైతం ధ్రువీకరిస్తున్నది!. రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్‌ దీవుల వరకు ఈ వారధి ఉంటుంది. అయితే, రామసేతుకు సంబంధించిన పలు రహస్యాల ఛేదనలో ఇస్రో మరో మైలురాయిని చేరింది. నాసాకు చెందిన ఉపగ్రహం సహాయంతో తొలిసారిగా ఆడమ్‌ బ్రిడ్జిగా పిలిచే రామసేతు మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. ఇస్రో రూపొందించిన పది మీటర్ల మ్యాప్‌లో మొత్తం వంతెన కనిపిస్తుండడం విశేషం. ఇస్రో అమెరికాకు చెందిన ఉపగ్రహం ఏస్‌శాట్‌-2 డేటాను వినియోగించి సేతుకు సంబంధించిన మ్యాప్‌ను సిద్ధం చేసి విడుదల చేశారు.

అక్టోబర్ 2018 నుంచి 2023 అక్టోబర్ మధ్య ఆరు సంవత్సరాల డేటాను సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ల శాస్త్రవేత్తలు దీనిపై ఓ జర్నల్‌లో నివేదిక ప్రచురితమైంది. భారత్, శ్రీలంక మధ్యనున్న ఈ రామసేతు పొడవు 29 కిలోమీటర్ల ఉంటుంది. సముద్రగర్భం నుంచి దీని ఎత్తు 8 మీటర్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ సేతు 99.98 శాతం నీటిలో మునిగి ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తెలిపారు. రామాయణ కాలంలో లంకాధిపతి రావణుడు సీతమ్మ అమ్మవారిని అపహరించాడు. ఆమెను అక్కడే ఉంచాడు. హనుమంతుడు లంకాయాణం చేసి సీతమ్మ జాడను కనుగొంటాడు. ఆ తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రంపై వంతెనను వానరసేన నిర్మించింది. ఆ సేతుపై నుంచే వానరసేన లంకకు చేరుకుంది. అయితే, క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను ‘సేతు బంధై’ గా పిలుస్తుండే వారు. రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం.. ఈ వంతెన 1480 వరకు తుఫానులతో ధ్వంసమైంది. అంతకు ముందు సముద్రమట్టానికి పైనే ఉండేది.