తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మారుస్తాం – కేటీఆర్

తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ పేరును జయశంకర్ లేదా పీవీ నరసింహారావు పేరును పెడుతామని తెలిపారు. అలాగే సచివాలయంలో తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని ఆయన ఖండించారు. తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలిగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

గతంలో మేము ఉన్నపుడు సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించిన స్థలంలో పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అని ఆయన అన్నారు.