IPL 2025: గుజరాత్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

IPL 2025: గుజరాత్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

ఐపీఎల్‌లో భాగంగా, రాజస్థాన్ రాయల్స్ తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) విధ్వంసకర శతకంతో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూర్యవంశీ ధాటికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 25 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కి నెట్టి పాయింట్స్‌ టేబుల్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 3 విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఏడింటిలో ఓటమిపాలైంది. ఇందులో 3 మ్యాచ్‌ల్లో విజయం ముంగిట బోల్తా పడింది. దాంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ సమీకరణం సంక్లిష్టంగా మారింది. అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి నెలకొంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా ఈ నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచినా.. ప్లే ఆఫ్స్ చేరలేదు. ఎందుకంటే ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 16 పాయింట్స్ కావాలి.

Advertisements

తొలి మ్యాచ్‌

ఇటీవలే 18 ఏండ్లు నిండిన ఐపీఎల్‌ కంటే తక్కువ వయసున్న వైభవ్‌ జైపూర్‌లో టైటాన్స్‌ బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డాడు. సిరాజ్‌, ఇషాంత్‌ శర్మ, వాషింగ్టన్‌, రషీద్‌ ఖాన్‌ వంటి బౌలర్లను క్లబ్‌స్థాయి బౌలర్లుగా మార్చేసి జైపూర్‌లో పరుగుల సునామీని సృష్టించాడు. మ్యాచ్‌లో వైభవ్‌ 101 పరుగులు చేస్తే అందులో సిక్సర్లు, బౌండరీల రూపంలోనే ఏకంగా 94 పరుగులు వచ్చాయంటే బంతిని అతడు ఎంత కసిగా బాదాడో అర్థం చేసుకోవచ్చు. సిరాజ్‌ తొలి ఓవర్లో తాను ఎదుర్కున్న రెండో బంతిని లాంగాన్‌ మీదుగా సిక్సర్‌గా మలిచిన వైభవ్‌ ఇషాంత్‌ శర్మ వేసిన 4వ ఓవర్లో 6, 6, 4, 6, 4తో ఏకంగా 28 పరుగులు చేసాడు. వాషింగ్టన్‌ ఐదో ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు, ఓ బౌండరీతో 17 బంతుల్లోనే ఐపీఎల్‌లో అతడు తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. వైభవ్‌, జైస్వాల్‌ జోరుతో పవర్‌ ప్లేలోనే రాయల్స్‌ 87/0గా నిలిచింది. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న అఫ్గాన్‌ బౌలర్‌ కరీమ్‌ జన్నత్‌ ఓవర్లో అయితే బాదుడును వైభవ్‌ మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఆ ఓవర్లో 6, 4, 6, 4, 4, 6తో ఏకంగా 30 రన్స్‌ రాబట్టి 90లలోకి వచ్చాడు. రషీద్‌ 11వ ఓవర్లో రెండో బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌తో 35 బంతుల్లోనే అతడి తొలి శతకం పూర్తయింది. సెంచరీ తర్వాత వైభవ్‌, ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయినా జైస్వాల్‌ సారథి రియాన్‌ పరాగ్‌ (32*) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు. ప్రసిద్ధ్‌ కృష్ణ, రషీద్‌ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

 
IPL 2025: గుజరాత్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

శతకం

ఓపెనింగ్‌ ద్వయం సుదర్శన్‌ (39), గిల్‌ తొలి వికెట్‌కు 10 ఓవర్లలోనే 93 పరుగులు జోడించి టైటాన్స్‌కు శుభారంభం అందించారు. పవర్‌ ప్లేలో ఈ ఇద్దరూ ఓవర్‌కు రెండు బౌండరీలకు తగ్గకుండా ఆడటంతో 6 ఓవర్లకు గుజరాత్‌ వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. భారీ మెరుపులేమీ లేకపోయినా ఈ జోడీ నిలకడగా రన్స్‌ రాబట్టింది. హసరంగ పదో ఓవర్లో స్వీప్‌ షాట్‌తో 29 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. రెండో స్పెల్‌లో బంతినందుకున్న తీక్షణ 11వ ఓవర్లో రెండో బంతికి సుదర్శన్‌ పరాగ్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. బట్లర్‌ రాకతో గుజరాత్‌ ఇన్నింగ్స్‌కు ఊపొచ్చింది. ఫిఫ్టీ తర్వాత గిల్‌ యుధ్వీర్‌ 14వ ఓవర్లో రెండు సిక్సర్లు దంచగా హసరంగ ఓవర్లో బట్లర్‌ 6, 6, 4, 6 బాది 24 పరుగులు పిండుకున్నాడు. శతకం వైపునకు సాగుతున్న గిల్‌ను తీక్షణ 17వ ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. గిల్‌ నిష్క్రమించినా ఆఖర్లో బట్లర్‌ దూకుడుతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది.

Read Also: IPL 2025: గుజరాత్ ఓటమి పై శుభ్‌మన్ గిల్ ఏమన్నారంటే!

Related Posts
Babar Azam: బాగా ఆడలేదని బాబర్ ను తప్పించారు… టీమిండియా ఇలా ఎప్పుడూ చేయలేదు: ఫఖార్ జమాన్
babar azam

ముల్తాన్ టెస్టులో పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం పాక్ క్రికెట్‌లో పెద్ద దెబ్బగా నిలిచింది. ఈ ఓటమి కారణంగా పాక్ జట్టులో భారీ మార్పులు Read more

Rahul Dravid: సంజూ శాంసన్‌ తో విభేదాలు స్పందించిన రాహుల్ ద్రవిడ్
Rahul Dravid: సంజూ శాంసన్‌ తో విభేదాలు స్పందించిన రాహుల్ ద్రవిడ్

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌ తో విభేదాలంటూ వచ్చిన వార్తలపై ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. తనకు సంజూ శాంసన్ Read more

మొన్న కోహ్లీ ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా జరిమానా పడే ఛాన్స్..
మొన్న కోహ్లీ ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా జరిమానా పడే ఛాన్స్..

తొలి రోజు తీవ్ర గందరగోళం నెలకొంది. వాషింగ్టన్ సుందర్ ఔట్ అయిన సమయంలో అంపైరింగ్‌పై ప్రశ్నల వర్షం కురిసింది. భారత్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ Read more

పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ
final match of champions tr

29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ మెగాటోర్నీకి అతిథ్యమిచ్చిన పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ను లాహోర్‌లో నిర్వహించాలనుకున్నప్పటికీ, తాజా పరిణామాలతో ఆ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×