రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా చాట్ లీక్

రాజ్ తరుణ్ – లావణ్య ల వ్యవహారం రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతుంది. ప్రేమిస్తున్నానని , పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరై..మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను దూరం చేసాడని చెప్పి లావణ్య అనే యువతీ నర్సింగ్ పోలీసులకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిర్యాదు తర్వాత సరైన ఆధారాలు లేవని చెప్పి..రివర్స్ లో పోలీసులు లావణ్య ఫై కేసు ఫైల్ చేసారు.

తర్వాత లావణ్య సాక్ష్యాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులకు అందజేయడం తో పోలీసులు రాజ్ తరుణ్ ఫై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే తాజాగా రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా చాట్ లీక్ అయ్యింది. 2023లో మాల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ తరుణ్ నుండి వచ్చిన ప్రపోజల్ కు మాల్వి మల్హోత్రా వెంటనే యాక్సెప్ట్ అంటూ మెసేజ్ పెట్టింది. అనేక సార్లు రాజ్ తరుణ్ కు మాల్వి హోటల్స్ బుక్ చేసింది. ప్రతీసారి కోయంబత్తూర్ మాధవ హోటల్ లో రాజ్ తరుణ్, మాల్వి కలిసినట్లు తెలుస్తోంది.

వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్ గా రాజ్ తరుణ్, మాల్వి మాట్లాడుకునేవారు. రోజువారి ప్లానింగ్స్, ట్రిప్స్, తదితర విషయాలపై ప్రతిదీ ఇద్దరు షేర్ చేసుకున్నారు. మాల్వి మల్హోత్రా పర్సనల్ విషయాలపైనా రాజ్ తరుణ్ చాటింగ్ లో ప్రస్తావించేవాడని తెలిసింది. ప్రస్తుతం వీరి మధ్య జరిగిన చాటింగ్ వ్యవహారం లీక్ కావడంతో లావణ్య చేసిన ఆరోపణలు నిజమే అని అంత మాట్లాడుకుంటున్నారు.