ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది.రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది.ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికితోడు విశాఖపట్నం ప్రాంతంలో మరింత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వాతావరణ పరిస్థితులు బాగా మారాయి.నైరుతి దిశ నుంచి వచ్చిన ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు మోస్తరు నుంచి తీవ్రమైనవిగా మారే అవకాశముంది.దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలు ఈ ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఎల్లో అలర్ట్ జారీ – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలకు కారణంగా విశాఖపట్నం సహా మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ముఖ్యంగా బుధవారం గురువారం రోజుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు.ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు చెట్ల కింద ఉండకూడదు. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు తమ పంటలను సురక్షితంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఏప్రిల్ 11న ఉత్తరాంధ్ర జిల్లాల్లో తక్కువ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇకపోతే, రహదారులపై జల్లులు, వరదలు ఏర్పడే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు అత్యవసరమైన ప్రయాణాలకు మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు.వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే సూచనలు ఉన్నాయి.వేసవిలో కొంత ఊపిరి పీల్చుకునే అవకాశమున్నా, ఒకవేళ వర్షాలు అధికంగా పడితే, రైతులకు, ప్రజలకు సమస్యలు తప్పవు.కాబట్టి ముందే అప్రమత్తంగా ఉండటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
READ ALLSO : Nara Lokesh : యూనివర్సిటీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి: మంత్రి నారా లోకేశ్