Rahul ji come to Telangana.youth is calling

రాహుల్ జీ తెలంగాణకు రండి..యువత పిలుస్తోంది..: కేటీఆర్

హైదరాబాద్‌: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసిన విషయం తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన ఓ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ కేటీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

‘హలో రాహుల్ గాంధీ జీ, తెలంగాణ యువత మీరు చెప్పిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. 8 నెలల తర్వాత కాంగ్రెస్ విడుదల చేసిన ‘జాబ్ లెస్ క్యాలెండర్, జీరో ఉద్యోగాల కారణంగా యువత ఆందోళన బాట పట్టారు.మీరు ఎందుకు మళ్లీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చి అదే యువతను కలిసి మీరిచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చెప్పొచ్చు కదా’.. అని సూచించారు.

గతంలో రాహుల్ చేసిన ట్వీట్‌లో ‘తెలంగాణ యువత దొరల కేసీఆర్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతోందని..తన అశోక్ నగర్ పర్యటన తర్వాత ఈ విషయం స్పష్టమైందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వారి సమస్యను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, టీజీపీఎస్సీని యూపీఎస్సీలా పునరుద్ధరిస్తామన్నారు. యువవికాసం పథకం కింద 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. యువత ప్రజాపాలన సాగించే కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని ఇదే నా గ్యారంటీ’ అని ట్వీట్ చేశారు.

Related Posts
ట్రంప్ తొలిరోజే 200కు పైగా సంతకాలు!
trump

ప్రపంచ మీడియా అంతా ట్రంప్ ప్రమాణస్వీకారంపై ఫోకస్ చేసింది. ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు వంటి అంశాలపై దృష్టిని సారించింది. అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Read more

ఆస్కార్ నామినేషన్ల హంగామా 97వ అవార్డుల వేడుకకు సిద్ధం
80th Academy Awards NYC Meet the Oscars Opening

లాస్ ఏంజెలిస్ నగరాన్ని కార్చిచ్చు చుట్టుముట్టిన నేపథ్యంలో, ఆసక్తిగా ఎదురుచూస్తున్న 97వ ఆస్కార్ నామినేషన్లు ఎట్టకేలకు వెలువడాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ Read more

ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కోర్ట్ లో జగన్ పిటిషన్…
ys Jagan will have an important meeting with YCP leaders today

తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోర్ట్ ను ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి Read more

AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలి : అక్బరుద్దీన్ ఒవైసీ
Survey should be conducted in GHMC with AI technology.. Akbaruddin Owaisi

హైదరాబాద్‌: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ..AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలని పేర్కొన్నారు. నాంపల్లిలో డబుల్ ఓటర్ కార్డులున్నాయి. ఓటర్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే.. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *