ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలకంగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి పీఎస్సార్ సీతారామ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు హైదరాబాద్లో జరుగగా, ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఇది గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అనేక వివాదాస్పద విషయాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.

కేసు నేపథ్యం –
ముంబైకి చెందిన నటిగా ప్రసిద్ధి చెందిన కాదంబరి జెత్వానీ గతంలో ఏపీలోని కొన్ని ఉన్నతాధికారులు తనను మానసికంగా, శారీరకంగా వేధించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణల ప్రకారం, ఇంటెలిజెన్స్ మరియు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి కొన్ని వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టాన్ని తుంగలో తొక్కారట. ఆమె వాదనలో ముఖ్యంగా ఒక ఐపీఎస్ అధికారి పేరు గట్టిగా వినిపించింది – అదే పీఎస్సార్ సీతారామ ఆంజనేయులు.
రఘురామ ఘాటు వ్యాఖ్యలు
ఈ అరెస్టుపై ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ చాలా మందిని ఆశ్చర్యపరిచారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు నేను శుభవార్త విన్నాను. పీఎస్సార్ అరెస్టయ్యాడన్న వార్త. అతడు జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి అప్రజాస్వామికంగా వ్యవహరించాడు అని ఆయన వ్యాఖ్యానించారు. రఘురామ తనపై జరిగిన దాడిలో కూడా పీఎస్సార్ పాత్ర ఉందని, అతడు ఏ2గా ఉన్నారని తెలిపారు. జత్వానీ కేసులోనే కాదు, నన్ను మానసికంగా, శారీరకంగా బాధించే వ్యవహారాల్లో కూడా అతని పాత్ర గణనీయమైనది. పీవీ సునీల్ అనే మరో ఐపీఎస్ కూడా ఇదే విధంగా వ్యవహరించాడ అని చెప్పారు. రఘురామ తనపై దాడి కేసులో విచారణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక సామాన్యుడిని విచారించేందుకు పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారు. కానీ పెద్ద అధికారులపై మాత్రం విచారణనే ప్రారంభించరు. ఈ విచారణ మారుతీ 800 కారు వేగంతో కాకుండా రోడ్ రోలర్ లాగ సాగుతోంది అని ఎద్దేవా చేశారు. అలాగే, పీఎస్సార్ అరెస్టు తరువాత, ఇప్పుడు పీవీ సునీల్ నాయక్ కూడా విచారణకు లోబడతాడా? ఆయన బీహార్ నుంచి రావడం లేదని చెబుతున్నారు. ఇదే విధంగా విచారణను వేగవంతం చేసి న్యాయం జరగాలి అని అన్నారు.
పీఎస్సార్ అరెస్టుతో పాటు, పీవీ సునీల్ నాయక్, బి రవిశంకర్, తదితర పోలీస్ అధికారులపై కూడా విచారణలు జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే, మిగిలిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సీతారామాంజనేయుల్ని ఎలా అరెస్టు చేశారో అదే బాటలో తన కేసు కూడా వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నట్లు రఘురామ తెలిపారు. తన కేసు రిపోర్టులు తారుమారు చేసిన డాక్టర్ ను ఇప్పటికే విచారిస్తున్నారని తెలిపారు.
Read also: Student Attacks Lecturer: లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే?