Raghurama Krishnaraju: జగన్ తో విభేదించడం వల్ల మనస్పర్థలు వచ్చాయి :రఘురామకృష్ణరాజు

Raghurama Krishnaraju: జగన్ తో విభేదించడం వల్ల మనస్పర్థలు వచ్చాయి :రఘురామకృష్ణరాజు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికై, అదే పార్టీ అధినేత అయిన జగన్‌ మోహన్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు చేసిన మొదటి నాయకుడిగా చరిత్రలో నిలిచారు ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వైసీపీలోనే ఉంటూ జగన్ పై, ఆ పార్టీలోని కీలక నేతలపై యుద్ధమే చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో రఘురామ మాట్లాడుతూ జగన్ తో తనకు విభేదాలు ఎందుకొచ్చాయో వెల్లడించారు.

Advertisements

వైసీపీలోనే ఉండి జగన్‌ను ప్రశ్నించాను – రఘురామ

తాజాగా పాల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లిలో నిర్వహించిన ఎన్టీఆర్‌, కోడెల శివప్రసాద్‌ల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామ అక్కడ తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుపై వైసీపీ నాయకులు చులకనగా మాట్లాడేవారని అలా మాట్లాడటాన్ని తాను విభేదించడం వల్ల జగన్ తో తనకు తొలుత మనస్పర్థలు వచ్చాయని రఘురామ తెలిపారు. ఆ తర్వాత విభేదాలు ముదిరాయని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదని తాను రాజకీయాల్లోకి రాకముందే ఎంతో మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ గుంటూరు నియోజకవర్గానికి చెందిన కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరామ్ తదితరులు పాల్గొన్నారు.

Read also: TTD: తిరుమలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించిన టీటీడీ ఛైర్మన్

Related Posts
పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం
Another fire incident in Pa

ఏపీ లోని పరవాడ ఫార్మాసిటీలో మరోసారి విష వాయువుల లీకేజీ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విష వాయువులు లీక్ కావడంతో Read more

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు యథాతథం..
EPF: అత్యవసరంగా పిఎఫ్ డబ్బు కావాలా.. ఇలా చేస్తే మీ డబ్బు అకౌంట్లోకి..

న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై 2024-25 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ బోర్డు శుక్రవారం నిర్ణయించింది. 2024 ఫిబ్రవరిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ Read more

ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ మరో పిటిషన్ !
Another petition of Ram Gopal Varma in AP High Court

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని రామ్‌గోపాల్‌ Read more

India Pakistan War: ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ కొనసాగేనా?
India Pakistan War: ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ కొనసాగేనా

ఆపరేషన్ సిందూర్ ప్రభావం: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు – ఐపీఎల్ 2025 సీజన్‌పై సందిగ్ధత భారత సైన్యం ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపై Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×