రాధికా బ్యానర్ లో మెగాస్టార్ మెగా మూవీ..
తాజాగా ఆచార్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి..త్వరలో సీనియర్ నటి రాధికా బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్నీ రాధికా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. “థ్యాంక్యూ చిరు.. భవిష్యత్లో రాడాన్ ప్రొడక్షన్ హౌస్లో ప్రాజెక్ట్ చేస్తానని ఒప్పకున్నందుకు. కింగ్ ఆఫ్ మాస్తో బ్లాక్బస్టర్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని రాధిక ట్వీట్ చేశారు. అయితే ఈ చిత్ర వివరాలు ఏమి తెలుపలేదు. గతంలో చిరంజీవి-రాధిక కలయికలో దాదాపు 14 సినిమాలు వచ్చి ప్రేక్షకులను మెప్పించాయి.
వీటిలో కొండ వీటి దొంగ ,యముడికి మొగుడు , లంకేశ్వరుడు రాక్షసుడు ,కొదమ సింహం , అడవి దొంగ, జేబు దొంగ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం చిరంజీవి.. ‘భోళాశంకర్’, ‘గాడ్ఫాదర్’, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఆచార్య విషయానికి వస్తే..కొరటాల శివ డైరెక్షన్లో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా నటించగా..పూజా హగ్దే హీరోయిన్ గా నటించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది.