గోపీచంద్ పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమా..?

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమాను హీరో గోపీచంద్ చేసే అవకాశాలున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గోలీమార్’ మూవీ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరి కాంబో సెట్ అయినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం పూరి సినీ కెరియర్ ఏమాత్రం బాగాలేదు. గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. మధ్యలో ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యి కాస్త ఊపిరి పీల్చుకోనివ్వగా..ఆ తర్వాత లైగర్ భారీ డిజాస్టర్ అయ్యి షాక్ ఇచ్చింది. దీని తర్వాత ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ ఇటీవల థియేటర్లలో విడుదలై మరో డిజాస్టర్ అయ్యింది. దీంతో ఇక పూరికి సినిమా ఛాన్సులు రావడం కష్టమే అని అంత మాట్లాడుకుంటుండగా.. గోపీచంద్ తో సినిమా అనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలి. ప్రస్తుతం గోపీచంద్ శ్రీనువైట్లతో చేస్తున్న ‘విశ్వం’తో బిజీగా ఉన్నారు.