చంద్రబాబును కలిసిన పురందీశ్వరి

సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరూ రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే నామినేటెడ్ పోస్టులు, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా వీరు చర్చించినట్లు సమాచారం.

పురందేశ్వరిని శాలువా, పుష్పగుచ్ఛంతో చంద్రబాబు సత్కరించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని అందజేశారు. కాగా నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి 10 శాతం పదవులు కేటాయించినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.