సీఎం కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ

బిఆర్ఎస్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఢిల్లీ లో బిఆర్ఎస్ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ తో పాటు మిగతా రాష్ట్రాల ఫై ఫోకస్ చేశారు. ఈ క్రమంలో సోమవారం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న భగవంత్‌ సింగ్ మాన్‌ను.. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు.

కేసీఆర్ ఆహ్వానం మేరకు.. భగవంత్ మాన్ మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమవనున్నారు. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సహా పలు అంశాలపై ఈ సమావేశంలో ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. అయితే.. బీఆర్ఎస్ పెట్టిన తర్వాత.. ఇరువురు నేతలు భేటీ అవుతుండటంతో ఈ సమావేశానికి సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది.