Public examinations in the first year continues as usul

ఏపీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు యథాతథం ..

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సూచనల మేరకు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

image

ఎగ్జామ్స్ నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టరని, అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతాయని లాంటి పలు సూచనలు వచ్చాయి. అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను విరమించుకోనుంది. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. గణితంలో ఏ, బీ పేపర్లు ఉండవు. రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా ఇస్తారు. వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్‌ ఉంటుంది. రెండు భాష సబ్జెక్టుల్లో ఇంగ్లిష్ తప్పనిసరిగా ఉంటుంది. మరో భాష సబ్జెక్టును విద్యార్థులు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు. వీటిపై త్వరలో ఇంటర్మీడియట్‌ విద్యామండలి సమావేశం నిర్వహించి తీర్మానాలు చేయనున్నారు.

Related Posts
NDRF సేవలు ప్రశంసనీయం – చంద్రబాబు
CBN NDRF

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేషనల్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్ (NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా క్లిష్ట సమయాల్లో NDRF అందించే Read more

మహాకుంభ యాత్రికుల భద్రతను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

రాబోయే మహాకుంభ ఉత్సవాల్లో పాల్గొనే యాత్రికులకు భద్రతా చర్యలు, మార్గదర్శకాలను కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్, Read more

రామ్మూర్తి నాయుడు మృతి పట్ల వైఎస్ షర్మిల సంతాపం
sharmila ramurthi

రామ్మూర్తి నాయుడు మృతి పట్ల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం తెలియజేసారు. రామ్మూర్తి నాయుడు హఠాన్మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయినట్లు తెలిపారు. Read more

మోదీ ప్రభావం: నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రశంసలు
మోదీ ప్రభావం: నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా, నారా లోకేష్ ఆయనకు స్వాగతం పలికారు, భారతదేశ అభివృద్ధికి మోదీ నాయకత్వం మరియు దృష్టిని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *