పవన్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే ‘వార్త’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కిక్ ఇచ్చే వార్త తెలిపారు మైత్రి నిర్మాత రవికుమార్. ‘మత్తువదలరా-2’ టీజర్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేసి జనవరి 2025 కల్లా షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు SEP 2న స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందని తెలిపి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. అలాగే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ సైతం అక్టోబర్/ నవంబర్లో షూట్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ రెండు న్యూస్ తో ఇరు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

గతంలో హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ చేసాడు. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న పవన్ కు ఈ మూవీ బూస్ట్ ను ఇచ్చింది. అభిమానులు పవన్ నుండి ఏం కోరుకుంటున్నారో..హరీష్ పవన్ ను ఆలా చూపించేసరికి సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ కూడా అభిమానులు కోరుకునే విధంగా తెరకెక్కిస్తుండడం తో సినిమా ఫై రోజు రోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బిజీ గా ఉండడం తో షూటింగ్ కు బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుందని నిర్మాత రవి కుమార్ చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.