ప్రముఖ నిర్మాత డిల్లీ బాబు మృతి

ప్రముఖ తమిళ సినీ నిర్మాత డిల్లీ బాబు(50) కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో సూర్యతో రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్ వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ బ్యానర్ పై ఈయన తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా మిరల్, మరకతమణి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి.

ఢిల్లీ బాబు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు విషారం వ్యక్తం చేస్తున్నారు. ఈయన 1965 ఫిబ్రవరి 12న జన్మించారు. ఈయన వయసు 59 సంవత్సరాలు. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ తరుపున తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాల్లో కూడా సత్తా చాటారు. ఈయన మృతిపై సీపీఎం అనుబంధ సంఘాలు కూడా తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నాయి.