Wall Collapse: సింహాచలం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

Wall Collapse: సింహాచలం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

ఏపి విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం జరిగింది. స్వామివారి నిజ రూపాన్ని చూసేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలి ఏడుగురు చనిపోయారు. మరికొంతమంది భక్తులు గాయపడ్డారు. సింహాచలం బస్టాండ్ నుంచి పైకి వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర రూ.300 టికెట్ క్యూ లైన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. శిథిలాల కింద మరికొందరు చాలా మంది చిక్కుకున్నారు. వెంటనే ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రులకు ఈ ఘటనలో చనిపోయిన ఏడుగురు మృతదేహాలను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.

Advertisements

ఎక్స్‌గ్రేషియా

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకుంది.

 Wall Collapse: సింహాచలం ఘటనపై  ప్రధాని  దిగ్భ్రాంతి

సుప్రభాత

వరహా లక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా సింహగిరికి తరలి వచ్చారు.తెల్లవారుజామున ఒంటిగంటకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. ఆ తర్వాత స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని తీసేశారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు మొదటిగా నిజరూప దర్శనం కల్పించగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ తరఫున కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలు ఏర్పాటు చేశారు.

Read Also: Wall Collapse: సింహాచలం దుర్ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు

Related Posts
Pawan Kalyan : ఈనెల 28న ప.గో జిల్లాలో పవన్ పర్యటన
Pawan Kalyan మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా Read more

Golconda Blue Diamond: గోల్కొండ నీలి డైమండ్ తొలి సారి వేలానికి
Golconda Blue Diamond: గోల్కొండ నీలి డైమండ్ తొలి సారి వేలానికి

ప్రపంచంలోని విలువైన వజ్రాలలో ఒకటిగా పేరు పొందిన గోల్కొండ నీలి వజ్రం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది స్వాతంత్య్రానికి పూర్వం భారత రాజవంశాల ఆధీనంలో Read more

Donald Trump: అమెరికా ఎన్నికల వ్యవస్థలో మార్పులకు ట్రంప్ శ్రీకారం
అమెరికా ఎన్నికల వ్యవస్థలో మార్పులకు ట్రంప్ శ్రీకారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులను ప్రవేశపెట్టేందుకు అడుగులు వేశారు. ఆయన సంతకం చేసిన తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఎన్నికల విధానంలో Read more

అదానీ 4000 కోట్లతో ఎయిర్ వర్క్స్ కొనుగోలు
అదానీ 4000 కోట్లతో ఎయిర్ వర్క్స్ కొనుగోలు

అదానీ గ్రూప్ ఎయిర్ వర్క్స్‌ను 4000 కోట్లకు కొనుగోలు చేసింది గౌతమ్ అదానీ మరో భారీ వ్యూహాత్మక దశను అనుసరించారు. అదానీ గ్రూప్, ఎయిర్ వర్క్స్ అనే Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×