PM Modi will visit Gujarat today and tomorrow

ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక.. విశాఖ నగరంలో ప్రధాని మోడీ రోడ్ షో, బహిరంగ సభకు హాజరుకానున్నారు. ప్రధాని వస్తుండడంతో, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోడీ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లో 20 గిటావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు భారీ ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గం అమరావతి కి 54 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపింది. ఈ పనుల ప్రారంభం ప్రధానితో చేయించాలని చంద్రబాబు కోరుతున్నారు.

ఇకపోతే..ఏపీకి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి వరుస గుడ్ న్యూస్ లు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపిన మోడీ..ఆ హామీ ప్రకారం ఏపీకి అందాల్సిన నిధులు , పోలవరం ప్రాజెక్ట్ పూర్తి , పెండింగ్లో ఉన్న పనులు ఇవన్నీ త్వరగా పూర్తి అయ్యేలా దృష్టి పెట్టారు. ఇక సీఎం చంద్రబాబు సైతం కేంద్ర మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశలవుతూ వస్తున్నారు.

Related Posts
మహా శివరాత్రికి ముస్తాబవుతున్న వేములవాడ ఆలయం
Vemulawada temple is getting ready for Maha Shivratri

ఈ 25 నుంచి 27 వరకు మూడురోజుల జాతర హైదరాబాద్‌: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ప్రముఖ Read more

భారీగా ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్
భారీగా ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్

గత ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ తర్వాత భవిష్ అగర్వాల్ కలల ప్రాజెక్ట్ ఓలా ఎలక్ట్రిక్ లాభాల బాట పట్టేందుకు ప్రయత్నిస్తోంది. పెట్టుబడిదారుల నుంచి వస్తున్న హీట్ Read more

నేడు కాంగ్రెస్ చలో రాజ్ భవన్
Today Congress Chalo Raj Bhavan

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప Read more

రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. !
VIP break darshans canceled in Tirumala tomorrow.. !

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు ఓ ముఖ్య విషయాన్ని తెలియజేశారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబోతున్నారు. Read more