నెల్లూరు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన..

ప్రధాని మోడీ ఏపీలో పర్యటించబోతున్నారు. వచ్చే నెల 6న ప్రధాని మోడీ పర్యటన ఉండబోతుంది. నెల్లూరులోని చిల్లకూరు మండలం తమ్మినపట్నం వద్ద కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ కు శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ కు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. ..కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం అందడంతో ఏర్పాట్లలో అధికారులు చేస్తున్నారట. 12 వేల 500 ఎకరాల్లో ఏర్పాటు కానుంది క్రిస్ సిటీ. దీని కోసం ఇప్పటికే భూ సేకరణ చేసింది ఏపీ ప్రభుత్వం.