President Droupadi Murmu is coming to Hyderabad today

నేడు హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు ఆమె నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రపతి పర్యటనకు ఎటువంటి ఇబ్బందులు తలెతకుండా పోలీసులు భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో నేడు రేపు (గురు, శుక్రవారాలు) ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్‌ పి.విశ్వప్రసాద్‌ వెల్లడించారు.

Advertisements

ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పంజాగుట్ట జంక్షన్, గ్రీన్‌ ల్యాండ్‌ జంక్షన్, బేగంపేట్‌ ఫ్లైఓవర్, శ్యాంలాల్‌ బిల్డింగ్, పీపీఎన్‌టీ ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్‌ ఔట్‌గేట్, ఎయిర్‌పోర్టు వై.జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కత్రియ హోటల్, మెట్రో రెసిడెన్సీ, పీవీ విగ్రహం, రాజ్‌ భవన్‌ రోడ్, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్, నెక్లెస్‌ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్‌ మార్గ్, కట్టమైసమ్మ, ఇక్బాల్‌ మినార్, ట్యాంక్‌ బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం జంక్షన్, అశోక్‌నగర్‌ జంక్షన్‌, ఎన్టీఆర్‌ స్టేడియం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.

ఈనెల 22న (శుక్రవారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాదాపూర్, రాయదుర్గం, కొత్తగూడ, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను చూసుకోవాలని సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్‌ సమాచారం కోసం ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ టోల్ ఫ్రీ నెంబర్ 85004 11111 అందుబాటులో ఉంటుందని చెప్పారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు.

ఇకపోతే..రాష్ట్రపతి ముర్ము ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనున్నారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా నిర్వహించే లోక్ మంతన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి 120 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Posts
కుళ్ళిన చికెన్ విక్రయిస్తున్నారు జర జాగ్రత్త!
కుళ్ళిన చికెన్ విక్రయిస్తున్నారు జర జాగ్రత్త!

హైదరాబాద్‌లో సరికొత్త దందా బయటపడింది. సికింద్రాబాద్ బేగంపేట్ ప్రాంతంలో, అన్నానగర్‌లోని పలు చికెన్ సెంటర్లపై ఆహారభద్రత మరియు టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో Read more

అమెజాన్ ఫ్రెష్ వారి సూపర్ వాల్యూ డేస్..ఆఫర్లే ఆఫర్లు
Amazon Fresh is their super

బెంగుళూరు 2024: చలికాలం వస్తూ, తనతో పాటు వెచ్చదనాన్ని తెచ్చింది. మీకు అవసరమైన వెచ్చని ఆహారాన్ని, నిత్యావసరాలను అన్నింటినీ కూర్చి పెట్టుకోవటానికి ఇది అనువైన సమయం. అమెజాన్ Read more

ఢిల్లీ ఎన్నికలు.. తొలి గంటల్లో పోలింగ్ శాతం..
Delhi Elections.. Polling percentage in the first hours

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కాగా.. తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్‌ నమోదైంది. పలు Read more

Job Mela : 3 నెలలకోసారి జాబ్ మేళాలు – సీఎం చంద్రబాబు
కలెక్టర్ సదస్సులో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి Read more

×