తిరుమల లడ్డు ఫై స్పందించని బాపు బొమ్మ

తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. తిరుమల శ్రీవారిని కోట్లాది మంది భక్తులు ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు. అలాంటి తిరుమల లడ్డు గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంగా మారాయి. మరోవైపు భక్తుల మనోభావాలు కూడా ఆందోళనకు గురయ్యే విషయం అనిచెప్పవచ్చు. చంద్రబాబు ఇటీవల మాట్లాడుతూ.. గత వైసీపీ సర్కారు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వులను ఉపయోగించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

జగన్ సర్కారు తిరుమల పవిత్రను అత్యంత దిగజార్చాడంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీంతో నిన్నటి నుంచి ఒక్కసారిగా రాజకీయంగా దుమారంగా మారింది. దీనిపైన ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఈ చర్యను తప్పు పడుతున్నారు. ఇప్పటీకే దీనిపై పలువురు రాజకీయేతర నేతలు , ప్రముఖులు స్పందించగా..తాజాగా నటి ప్రణీత సైతం రియాక్ట్ అయ్యారు.

లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించడం వెంకటేశ్వర స్వామి భక్తులు ఊహించలేని అంశమని ఆవేదన చెందారు. బాధ్యులపై కఠిన తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు లడ్డూ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అటు ఇదే వ్యవహారంపై అధికార పార్టీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా, పవన్ కల్యాణ్‌తో అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత నటించిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే రెండోసారి తల్లయ్యారు. పండంటి మగబిడ్డకు ( baby boy) జన్మనిచ్చారు. ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ కన్నడ సోయగం.. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. కరోనా సమయంలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుని వివాహం చేసుకున్నారు. 2021లో కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 2022లో ఈ జంటకు ఆడబిడ్డ పుట్టింది. ఇప్పుడు రెండో కాన్పులో ప్రణీత మగబిడ్డకు జన్మనిచ్చారు.