Pranab Mukherjee son Abhijit Mukherjee joined the Congress

కాంగ్రెస్‌లో చేరిన ప్రణబ్ ముఖర్జీ కుమారుడు

కాంగ్రెస్‌ను వీడటం ఒక పొరపాటు నేను చింతిస్తున్నా..

కోల్‌కతా: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, లోక్‌సభ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నాలుగేళ్లు తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఉన్న ఆయన బుధవారం పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ వ్యక్తి కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తాడు. అది సహజం. కాంగ్రెస్‌ను వీడటం ఒక పొరపాటు. నేను చింతిస్తున్నా అని అన్నారు.

image

కాగా, ఇంజినీర్‌ అయిన అభిజిత్ ముఖర్జీ రాజకీయాల్లోకి రాకముందు ప్రధాన కార్పొరేట్ సంస్థల్లో పనిచేశారు. తండ్రి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయిన తర్వాత 2012లో బెంగాల్‌లోని జాంగిపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో బీజేపీ అఖండ విజయం సాధించినప్పుడు కూడా ఆ స్థానాన్ని నిలుపుకున్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఖలీలూర్ రెహమాన్ చేతిలో ఆయన ఓడిపోయారు.

మరోవైపు 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన తర్వాత అభిజిత్ ముఖర్జీ ఆ పార్టీలో చేరారు. బీజేపీని నిలువరించడం ఒక్క మమతా బెనర్జీకి మాత్రమే సాధ్యమని కితాబు ఇచ్చారు. చాలా కాలం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న తనకు ప్రాథమిక సభ్యత్వం తప్ప ఏ పదవి లేదా పాత్ర ఇవ్వలేదని ఆరోపించారు. అయితే తృణమూల్‌లో కూడా ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు.

Related Posts
చైనా ఖాతాలో మరో రికార్డు
చైనా ఖాతాలో మరో రికార్డు

భూగర్భ పరిశోధనలో చైనా మరో మైలురాయిని సాధించింది. భూమి అంతరాళాన్ని అధ్యయనం చేయడానికి చైనా 10.9 కిలోమీటర్ల లోతైన బోరు బావిని తవ్వి ఆసియాలోనే అత్యంత లోతైన Read more

రానిటిడిన్: USలో నిషేధం భారత్‌లో అమ్మకం
రానిటిడిన్: USలో నిషేధం భారత్‌లో అమ్మకం

రానిటిడిన్ అనే గుండెల్లో మంట తాగించే మందు, NDMA (ఎన్-నైట్రోసోడిమెథైలమైన్) అనే సంభావ్య క్యాన్సర్ కారక మలినాలతో సంబంధం ఉండదన్న కారణంగా USలో నిషేధించబడింది. అయితే, భారతదేశంలో Read more

స్వీడన్, నార్వే యుద్ధానికి సిద్ధం: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ఎలా మారిపోతుంది?
NATO

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు యుకె ప్రధాని కీర్ స్టార్మర్ ఉక్రెయిన్‌ను శక్తివంతమైన ఆయుధాలతో సన్నద్ధం చేసేందుకు ATACMS మరియు స్టార్మ్ షాడో ఆయుధ వ్యవస్థలను Read more

నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
AP state cabinet meeting today

అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. అయితే ఈ భేటీలో వివిధ అంశాలపై Read more