హైడ్రా దెబ్బకు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పేదలు

హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తూనే ఉంది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ వస్తుంది. రాజకీయ , సినీ , బిజినెస్ ఇలా ఎవర్ని వదలడం లేదు. నోటీసులు ఇవ్వడం , కూల్చేయడం చేస్తుంది. అయితే హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్లోని పేదల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. చెరువులు, కుంటలు, నాలాల పక్కన అనుమతులు తీసుకున్న, తీసుకోని ఇళ్లు నిర్మించుకున్న పేదలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు ఎప్పుడు తమ ఇళ్లు కూల్చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. కాగా ఆక్రమణదారులను ఎట్టి పరిస్థితుల్లో వదలమని, కోర్టుకు వెళ్లినా కూల్చి తీరుతామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.