వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

మంత్రి పొన్నం ప్రభాకర్‌..బుధువారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. బుధవారం ఆయన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్‌తో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..తాను రాజన్న భక్తుడినని , రాబోయే కార్తీక మాసంలో నిత్యా న్నదానం చేయాలనే ఆలోచన ఉంది. తిరుమలలో లాగా శాశ్వత అన్నదానం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడలో కోడెల రక్షణపై సీఎం ఆదేశాలతో గోశాల ఆధునీకరణ చేస్తున్నామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థంవసతి గదుల నిర్మాణం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం మంచి వర్షాలతో బాగుండాలని రాజన్నను వేడుకున్నట్లు పేర్కొన్నారు.