Police Arrests Maoist Prime Leader Sujatha in Kothagudem

మావోయిస్టు కీలక నేత కల్పన అలియాస్ సుజాత అరెస్ట్: ఆమెపై రూ. కోటి రివార్డు

ఖమ్మం: వరుస ఎన్‌కౌంటర్లతో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేసిన ఆమెపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో రూ.కోటికిపైగా రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, సుజాత బస్తర్‌ డివిజనల్‌ కమిటీకి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. సుక్మా ప్రాంతంలో జరిగిన అనేక ఘటనల్లో ఆమె మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నారు. చికిత్స నిమిత్తం కొత్తగూడెంలోని దవాఖానకు వెళ్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

అక్టోబర్‌ 4న ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌-దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమయ్యారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌-కోబ్రా, ఎస్‌టీవో బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నారాయణ్‌పూర్‌ జిల్లా ఓర్చా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నెండూర్‌-తులతులీ గ్రామల మధ్య గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. మృతులు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) 6వ కంపెనీ, తూర్పు బస్తర్‌ డివిజన్‌కి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో రూ.25 లక్షల రివార్డున్న దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలు, తూర్పు బస్తర్‌ డివిజన్‌ ఇన్‌చార్జి నీతి అలియాస్‌ ఊర్మిలతో పాటు డివిజినల్‌ కమిటీ సభ్యులు సురేశ్‌ సలాం, మీనా మడకం ఉన్నారు.

Related Posts
కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పరిశోధనలు వేగవంతం
KL College of Pharmacy which accelerated the research

హైదరాబాద్‌: కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యూనివర్సిటీ , సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (సెర్బ్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ Read more

కేటీఆర్ అమరణ నిరాహార దీక్ష..ఎంపీ చామల కౌంటర్
KTR hunger strike to death..MP Chamala counters

హైదరాబాద్‌: స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కేటీఆర్‌కు దళితులపై Read more

పోడు రైతులకు డిప్యూటీ సీఎం భట్టి గుడ్ న్యూస్
Deputy CM Bhatti is good ne

తెలంగాణ రాష్ట్రంలోని పోడు రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా పట్టాలు పొందిన రైతులకు సాగు చేయడానికి Read more

మన్మోహన్ సింగ్‌‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
Manmohan Singh should be given Bharat Ratna.. CM Revanth

హైదరాబాద్‌: భారత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపేందుకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఈనెల 26న కన్నుమూసిన మాజీ Read more