Police Arrests Maoist Prime Leader Sujatha in Kothagudem

మావోయిస్టు కీలక నేత కల్పన అలియాస్ సుజాత అరెస్ట్: ఆమెపై రూ. కోటి రివార్డు

ఖమ్మం: వరుస ఎన్‌కౌంటర్లతో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేసిన ఆమెపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో రూ.కోటికిపైగా రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, సుజాత బస్తర్‌ డివిజనల్‌ కమిటీకి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. సుక్మా ప్రాంతంలో జరిగిన అనేక ఘటనల్లో ఆమె మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నారు. చికిత్స నిమిత్తం కొత్తగూడెంలోని దవాఖానకు వెళ్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

అక్టోబర్‌ 4న ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌-దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమయ్యారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌-కోబ్రా, ఎస్‌టీవో బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నారాయణ్‌పూర్‌ జిల్లా ఓర్చా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నెండూర్‌-తులతులీ గ్రామల మధ్య గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. మృతులు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) 6వ కంపెనీ, తూర్పు బస్తర్‌ డివిజన్‌కి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో రూ.25 లక్షల రివార్డున్న దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలు, తూర్పు బస్తర్‌ డివిజన్‌ ఇన్‌చార్జి నీతి అలియాస్‌ ఊర్మిలతో పాటు డివిజినల్‌ కమిటీ సభ్యులు సురేశ్‌ సలాం, మీనా మడకం ఉన్నారు.

Related Posts
ఫార్ములా-ఈ కేసు..లొట్టపీసు కేసు – కేటీఆర్
KTR e race case

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇటీవల ఫార్ములా-ఈ-కార్ కేసులో ఢిల్లీ ఈడీ నుంచి నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నోటీసులపై ఆయన తీవ్రంగా Read more

ఢిల్లీ స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు..
Non stop bomb threats to Delhi schools

న్యూఢిల్లీ: ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈస్ట్‌ ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్‌ ద్వారా వార్నింగ్‌ రావడంతో Read more

కన్నడ హీరో దర్శన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ
కన్నడ హీరో దర్శన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ

కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన దర్శన్ ప్రస్తుతం తన అభిమానుడు రేణుకా స్వామి హత్య కేసులో న్యాయ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో Read more

ఆరోగ్యకరమైన మిరప పువ్వులు, సంతోషకరమైన రైతులకు భరోసా అందిస్తున్న గోద్రెజ్ రాషిన్‌బాన్
Godrej Rashinban ensures healthy chilli flowers and happy farmers

హైదరాబాద్‌: మిరప మొక్కలో కీలకమైన ఆర్థిక భాగమైనందున, మిరప సాగులో పువ్వులు విజయానికి అత్యంత కీలకం. ఈ కీలకమైన వాస్తవాన్ని గుర్తించి, ఈ కీలకమైన మొక్కల నిర్మాణాలను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *