‘మీ ప్రొఫైల్ పిక్గా జాతీయ జెండాను పెట్టుకోండి’ – ప్రధాని మోడీ పిలుపు
స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నందున ప్రతీఒక్కరూ జాతీయ జెండాను సోషల్ మీడియా అకౌంట్లకు ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. హర్ఘర్తిరంగా ను గుర్తిండిపోయే ఈవెంట్గా మార్చుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు. “నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను. మీరు కూడా అలాగే చేయండి. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను https://harghartiranga.comలో షేర్ చేయండి” అని మోదీ ట్వీట్ చేశారు. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ఖాతాల డీపీలను త్రివర్ణ పతాకంతో మార్పు చేయాలని పిలుపునిచ్చారు.