PM Modi: ప్రధాన మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో శ్రీలంక , థాయ్లాండ్ లో పర్యటించనున్నారు. ఈ రెండు దేశాల పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ముందుగా ఏప్రిల్ 3,4 తేదీల్లో ప్రధాని థాయ్లాండ్లో పర్యటించనున్నారు. థాయ్లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా పేటోంగ్టార్న్తో భేటీ కానున్నారు. ఏప్రిల్ 4వ తేదీన బ్యాంకాక్లో జరగనున్న బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కూటమి సమావేశంలో పాల్గొంటారు.

ఏప్రిల్ 4న శ్రీలంకకు
ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలంపై దేశాధినేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత థాయ్లాండ్ పర్యటనను ముగించుకొని ప్రధాని ఏప్రిల్ 4న శ్రీలంక వెళతారు. ఏప్రిల్ 6వ తేదీ వరకూ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు అనురకుమార దిసనాయకే గతేడాది భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు మోదీ శ్రీలంక పర్యటనకు వెళ్లబోతున్నారు. మోడీ తన పర్యటనలో రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై చర్చించనున్నారు.