PM Modi schedule for another foreign visit has been finalized

PM Modi : మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ.. షెడ్యూల్‌ ఖరారు

PM Modi: ప్రధాన మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో శ్రీలంక , థాయ్‌లాండ్‌ లో పర్యటించనున్నారు. ఈ రెండు దేశాల పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ముందుగా ఏప్రిల్‌ 3,4 తేదీల్లో ప్రధాని థాయ్‌లాండ్‌లో పర్యటించనున్నారు. థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్ర ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా పేటోంగ్టార్న్‌తో భేటీ కానున్నారు. ఏప్రిల్‌ 4వ తేదీన బ్యాంకాక్‌లో జరగనున్న బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ మల్టీ సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ కూటమి సమావేశంలో పాల్గొంటారు.

Advertisements
మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని

ఏప్రిల్‌ 4న శ్రీలంకకు

ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలంపై దేశాధినేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత థాయ్‌లాండ్‌ పర్యటనను ముగించుకొని ప్రధాని ఏప్రిల్‌ 4న శ్రీలంక వెళతారు. ఏప్రిల్‌ 6వ తేదీ వరకూ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు అనురకుమార దిసనాయకే గతేడాది భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు మోదీ శ్రీలంక పర్యటనకు వెళ్లబోతున్నారు. మోడీ తన పర్యటనలో రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై చర్చించనున్నారు.

Related Posts
సుంకంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్-అమెరికా అంగీకారం
సుంకంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్-అమెరికా అంగీకారం

వాణిజ్యం, సుంకాల సంబంధిత అంశాలపై చర్చలు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. వైట్‌హౌస్‌లో Read more

ప్రపంచ వాతావరణ మార్పును ఎదుర్కొనే యునైటెడ్ నేషన్స్ వేదిక
Flag of the United Nations.svg

యునైటెడ్ నేషన్స్ (యూ.ఎన్.) వాతావరణ చర్చలు అన్ని దేశాలకు వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు ఒక వేదికను అందిస్తాయి. ఈ చర్చలు ప్రతీ సంవత్సరం జరిగే గ్లోబల్ సమాగమంగా Read more

ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (IITF)..
india international trade fair

ప్రతీ సంవత్సరం, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (IITF) ఒక విశాలమైన వాణిజ్య మరియు సాంస్కృతిక ప్రదర్శనగా ప్రగ్యతి మైదాన్, ఢిల్లీ లో నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం, Read more

అధికారుల మీద దాడి..మనమీద మనం దాడి చేసుకునట్లే: మంత్రి పొంగులేటి
Minister ponguleti srinivasa reddy

హైదరాబాద్‌ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వికారాబాద్‌ ఘటనపై మరోసారి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడ్డారు. వికారాబాద్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×