జర్మనీకి చెందిన ప్రతిభాశాలి, గాయని కాస్మే (అసలు పేరు కాసాండ్రా మే స్పిట్మాన్) భారతీయ సంగీతాన్ని తన ఇంటర్నెట్ ప్లాట్ఫారమ్లలో పాడటం ద్వారా విపరీతమైన ప్రజాదరణ పొందారు. ముఖ్యంగా దక్షిణ భారత భక్తి గీతాలు, కీర్తనలు, పాటలు పాడటానికి ప్రాచుర్యం పొందిన ఆమె, కాంతారా సినిమాలోని “వరాహ రూపం” పాటను ఆలపించిన తర్వాత భారతదేశంలో విస్తృత అభిమానులను సంపాదించారు.తమిళనాడులోని పల్లడం వద్ద జర్మన్ గాయని కాసాండ్రా మై స్పిట్మాన్, ఆమె తల్లిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ కార్యక్రమాలలో ఒకదానిలో కాసాండ్రా మే స్పిట్మన్ గురించి ప్రస్తావించారు. కాసాండ్రా మే స్పిట్మాన్ అనేక భారతీయ భాషలలో పాటలు, ముఖ్యంగా భక్తి పాటలు పాడుతున్నారు. ప్రధాని మోదీ ముందు అచ్యుతం కేశవం అనే పాట పాడారు. ఆమె పాట విన్న తర్వాత ప్రధాని మోదీ ఆమెను ఎంతగానో అభినందించారు.
మన్ కీ బాత్
ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు సనాతన ధర్మం పట్ల, హిందూత్వ పట్ల ఆకర్షితురాలై పూర్తిగా హిందువుగా మారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రధాని మంత్రి మన్ కీ బాత్ సోషల్ మీడియా టీమ్ ఎక్స్ వేదికా ట్వీట్ చేశారు. జర్మనీ దేశానికి చెందిన ప్రముఖ గాయని కాసాండ్రా మై స్పిట్మాన్ హిందువుత్వం పట్ల ఎలా ఆకర్షితులయ్యారో చూడండి అంటూ పేర్కొన్నారు.
గాయని కాస్మే
జర్మనీకి చెందిన ప్రతిభావంతులైన గాయని కాస్మే, భారతీయ పాటలను, ముఖ్యంగా ‘కీర్తనలు’ పాడటం ద్వారా భారతదేశంలో భారీ అభిమానులను సంపాదించుకున్నారు. “మన్ కీ బాత్” 105వ ఎపిసోడ్ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 21 ఏళ్ల దృష్టి లోపం ఉన్న కళాకారిణిని విస్తృత భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేశారు. జర్మనీకి చెందిన కాస్మేకు భారతదేశాన్ని ఎప్పుడూ సందర్శించని ఆమెకు భారతీయ సంగీతం పట్ల లోతైన ప్రేమ ఉందని, దానిని పాడటం ఆనందిస్తారని ప్రధానమంత్రి గర్వంగా వ్యక్తం చేశారు. కాస్మేను ‘స్ఫూర్తిదాయక వ్యక్తి’ అని ప్రశంసించారు.జర్మనీకి చెందిన కాస్మే, భారతదేశంలో ఎప్పుడూ అడుగు పెట్టని ఆమె లాంటి వ్యక్తి భారతీయ సంగీతం పట్ల లోతైన అభిమానాన్ని ప్రదర్శించడం నిజంగా హృదయపూర్వకంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దృష్టి లోపం ఉన్నప్పటికీ, సంగీతం పట్ల కాస్మేకు ఉన్న అచంచలమైన మక్కువ ఆమెను అద్భుతమైన విజయాలకు నడిపించిందని, పరిమితులు ఆమె కలలను కొనసాగించకుండా నిరోధించలేవని నిరూపించాయని ప్రధాని మోదీ స్ఫూర్తిదాయకంగా భావించారు.
దక్షిణ భారత పాటలు పాడటానికి ప్రసిద్ధి చెందిన జర్మన్ గాయని కాస్మే, “వరాహ రూపం” అనే హిట్ పాట కోసం కాంతారా సినిమాకు పాడిన తర్వాత భారతదేశంలో విస్తృత ప్రజాదరణ పొందారు. ఆ తర్వాత సినిమా నటుడు రిషబ్ శెట్టి కాస్మే ప్రతిభను ప్రశంసిస్తూ ప్రోత్సహించారు.