ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణానికి కొత్త శకం మొదలైంది. 2025 మే 2న, అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అట్టహాసంగా భూమి పూజ చేయడం ద్వారా రాజధాని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ఘట్టం రాజకీయంగా గాక, సామాజికంగా కూడా చారిత్రాత్మక మలుపు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పునాది వేయడమే కాక, గత ఐదేళ్లుగా త్యాగభరితంగా పోరాడిన రైతులకు ఇది గెలుపు ఘడియగా నిలిచింది.
రైతుల పట్ల గౌరవం
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కో అడుగూ రైతుల పట్ల కృతజ్ఞతతో నిండినట్టు స్పష్టమైంది. రాజధాని కోసం భూములను స్వచ్ఛందంగా అందించిన 29 గ్రామాల రైతులు, ఆందోళనలకు పాల్పడి న్యాయం కోసం పోరాడిన వారు – వారి త్యాగాన్ని ప్రభుత్వం ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలో రైతులకు ప్రత్యేక గౌరవం ఇచ్చింది.
మోదీ సందేశం –
ప్రధాని మోదీ తన ప్రసంగంలో అమరావతిని కేవలం కాంక్రీట్ నిర్మాణాల రాజధానిగా కాకుండా, భారతాభివృద్ధికి పునాది రాయిగా వర్ణించారు. ఈ వేడుకలో అడుగడుగునా రైతులకు జై కొట్టింది ఏపీ ప్రభుత్వం. రాజధాని కోసం భూములు ఇవ్వడమే కాకుండా గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోంటూ పొరాటం కొనసాగించిన వారి సంకల్పానికి సెల్యూట్ కొట్టారు. అయితే రాజధాని అమరావతి విషయంలో రైతులు గానీ, ఏపీ ప్రజలు గానీ ఏవైతే ఆశించారో అవే మాటలు వినిపించాయి ప్రధాని మోదీ నుంచి ‘కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కావు ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కు బలమైన పునాదులు’ అంటూ రాజధాని అమరావతి గురించి ఒకే ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశారు ప్రధాని మోదీ. అమరావతి నిర్మాణానికి కేంద్రం అండగా ఉంటుందనే భరోసా ఇచ్చారు. ఆంధ్రుల రాజధాని అనే స్వప్నం త్వరలోనే సాకారం కాబోతోందన్న విషయం తన కళ్ల ముందు మెదులుతోందని చెప్పడంతో అమరావతిపై ఉన్న అనుమానాలన్నీ చెరిగిపోయినట్టే కనిపించాయి
మోదీ ట్వీట్ –
ఈ కార్యక్రమం అనంతరం మోదీ తన ట్విట్టర్ ఖాతాలో “చంద్రబాబు నా మిత్రుడు. ఆయనకు ఉన్న దార్శనికత, అభివృద్ధి పట్ల నిబద్ధత అభినందనీయం” అని వ్యాఖ్యానించారు. ఇది కేంద్రం-రాష్ట్ర సంబంధాల్లో ఉన్న అనుబంధాన్ని, సహకారాన్ని చాటిచెప్పే అంశంగా నిలిచింది. ‘‘అమరావతి అభివృద్ధిలో నూతన, చారిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం ఆనందంగా ఉంది. అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాన్ని మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నాకు మంచి మిత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అమరావతి పట్ల ఉన్న దార్శనికత ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు.
Read also: Jagan Mohan Reddy: రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం:జగన్ ఆగ్రహం