పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ రిజిస్ట్రేషన్‌ తేదీ పొడిగింపు

Pm Internship : పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ రిజిస్ట్రేషన్‌ తేదీ పొడిగింపు

యువతకు నైపుణ్యాలు నేర్పించి, ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం 300కు పైగా కంపెనీల్లో, లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించనుంది. మొదటగా మార్చి 12 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిన గడువును, తాజాగా మార్చి 31 వరకు పొడిగిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇది చివరి అవకాశం.ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో ప్రతి నెల రూ. 5,000 స్టైఫండ్,కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్‌టైం గ్రాంట్‌) కూడా చెల్లిస్తారు. అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.11,000 పొందుతారు. ఏడాదిలో ఆరు నెలలు క్లాస్‌ రూంలో,మిగిలిన 6 నెలలు ఫీల్డ్‌లో శిక్షణ ఉంటుంది. శిక్షణలో ఆరు నెలలు క్లాస్‌రూమ్ ట్రైనింగ్, మిగిలిన ఆరు నెలలు ప్రాక్టికల్ ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. రాబోయే ఐదేళ్లలో టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు అందించడమే ఈ పథక లక్ష్యం.

Advertisements

అర్హులు

పదో తరగతి పాసైన అభ్యర్థులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగి ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు ఈ పథకానికి అర్హులు. ఆన్‌లైన్‌/దూరవిద్య ప్రోగ్రామ్‌లో చదువుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అనర్హులు

ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకు చెందినవారు, వార్షికాదాయం రూ. 8 లక్షలు దాటిన కుటుంబాలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు, సీఏ, సీఎంఏ అర్హత కలిగినవారు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా కేంద్రం పేర్కొంది.

రాబోయే ఐదేళ్లలో టాప్‌ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యే కంపెనీలు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ అందిస్తాయి. ఇంటర్న్‌షిప్‌లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్ యువతకు నైపుణ్యాల పెంపు, ప్రాక్టికల్ అనుభవం, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రూపొందించబడింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి మరో ఐదేళ్లలో కోటి మందికి శిక్షణ అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి.

Related Posts
Etihad Airways: ఎతిహాద్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్: భారతీయులకు 30% డిస్కౌంట్!
ఎతిహాద్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్: భారతీయులకు 30% డిస్కౌంట్!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయ ప్రయాణికులకు ప్రత్యేక డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ వేసవిలో ఎతిహాద్ విమానాల్లో ప్రయాణించే భారతీయులకు Read more

Maoists : మావోయిస్టులకు మరో భారీ దెబ్బ
Maoists మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ

మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకుముందు ఎన్‌కౌంటర్లలో క్యాడర్‌ను కోల్పోయిన మావోయిస్టులు ఇప్పుడు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరిన్ని నష్టాలను ఎదుర్కొన్నారు. బీజాపూర్ జిల్లాలో 50 మంది Read more

రేపు తీరం దాటనున్న ‘దానా’ తుఫాన్..!
Dana thoofan

తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దానా’ తుఫాన్ వాయువ్య దిశగా కదులుతూ, రేపు తెల్లవారుజామున వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుందని,అంతకు ముందు అక్టోబర్ 24 అర్ధరాత్రి నుంచి Read more

రాహుల్ గాంధీకి పూణే కోర్టు సమన్లు జారీ
రాహుల్ గాంధీకి పూణే కోర్టు సమన్లు జారీ

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కి పూణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×