బక్సర్ జిల్లాలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ‘ప్రగతి యాత్ర’లో భాగంగాకు శనివారం బక్సర్లో అనేక ప్రాంతాలను సందర్శించారు. ఇందుకోసం ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు సర్క్యూట్ హౌస్ వెలుపల అధికారులు రకరకాల పూల కుండీలను ఉంచారు. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఈ కుండలను ముఖ్యమంత్రి వేదిక నుండి వెళ్లిపోయిన కొన్ని క్షణాల్లోనే స్థానిక మహిళలు, పిల్లలు పూల కుండీలు చేతబట్టి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది స్పందించేలోపే స్థానికులు వందలాది కుండీలను మాయం చేశారు. ఈ కుండీలన్నింటనీ అధికారులు స్థానిక నర్సరీ నుంచి మున్సిపల్ కౌన్సిల్ ద్వారా అద్దెకు తీసుకు వచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.బీహార్ ప్రభుత్వం బక్సర్ జిల్లాలో 51 గ్రామాలు, 20 పంచాయతీలలోని 36,760 గృహాలకు స్వచ్ఛమైన గంగా జలాన్ని అందించేందుకు రూ.202 కోట్లతో బహుళ-గ్రామ నీటి సరఫరా ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ఆర్సెనిక్ కాలుష్య సమస్యను అధిగమించడానికి సహాయపడనుంది.ఇకపోతే, సిమ్రిలో నమూనా పంచాయతీ భవనాన్ని, గోలంబార్లో విశ్వామిత్ర హోటల్ నిర్మాణాన్ని, రామరేఖ ఘాట్లో రూ.13 కోట్ల ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. 12 గదుల అతిథి గృహంతోపాటు జిల్లాలోని ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను కూడా సమీక్షించారు.
వైరల్గా మారిన వీడియో
బక్సర్ సర్క్యూట్ హౌస్ వద్ద అలంకరించిన పూలమొక్కలను మహిళలు, పిల్లలు పట్టుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భద్రతా సిబ్బంది స్పందించేలోపే వందలాది మొక్కలు మాయమయ్యాయి. ఈ మొక్కలను జిల్లా అధికారులు స్థానిక నర్సరీ నుంచి అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీఎంపై నిరసన
ముఖ్యమంత్రి పర్యటనపై మురికివాడ ప్రాంతాల మహిళలు నిరసన చేపట్టారు. అభివృద్ధి హామీలకు బదులుగా ఓట్లు డిమాండ్ చేస్తున్న నితీష్ కుమార్ పై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటు వేయకూడదని వారు తమ ఉద్దేశ్యాన్ని ప్రకటించారు. పరిస్థితిని నియంత్రించడానికి, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) జోక్యం చేసుకుని నిరసనకారులను దారి మళ్లించారు. కొంతమంది స్థానికులు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు కేవలం ముఖ్యమంత్రి పర్యటన కోసమే జరిగాయని ఆరోపించారు. అయితే సీఎం నితీష్ ప్రగతి యాత్రలో భాగంగా బక్సర్ జిల్లాలో పలు కార్యక్రమాలను వరుసగా ప్రారంభించారు.
బక్సర్ జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభించిన ప్రాజెక్టులు
నితీష్ కుమార్ ‘ప్రగతి యాత్ర’ లో భాగంగా బక్సర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యంగా,
36,760 కుటుంబాలకు శుద్ధిగంగా జల సరఫరా ప్రాజెక్టు – రూ.202 కోట్ల వ్యయంతో ప్రారంభించారు.
ఆర్సెనిక్ కాలుష్యంతో బాధపడుతున్న డయారా ప్రాంతానికి స్వచ్ఛమైన నీరు అందించే ప్రాజెక్టు
సిమ్రిలో నమూనా పంచాయతీ భవనం
గోలంబార్ ప్రాంతంలో విశ్వామిత్ర హోటల్ శంకుస్థాపన
రామరేఖ ఘాట్లో రూ.13 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టు
12 గదుల అతిథి గృహ ప్రారంభం
అంతేగాక, జిల్లా కేంద్రంలో అధికారులతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.