Piyush Goyal breaks down re

రతన్ టాటా మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు.

Advertisements

ఇక రతన్ టాటాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఎమోషనల్ అయ్యారు. ‘నా ఆహ్వానం మేరకు ఆయన ఓరోజు మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశారు. చాలా సింపుల్గా ఉంటారాయన. వెళ్లేటప్పుడు “నాతో ఫొటో దిగుతారా?” అని నా భార్యను అడిగారు. రతన్ తో ఫొటో దిగాలని ఎవరికి ఉండదు?’ అంటూ పీయూష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అది తమకు ఎప్పుడూ గుర్తుండిపోయే జ్ఞాపకమని వివరించారు.

రతన్​ టాటా 1937 డిసెంబర్‌ 28న ముంబయిలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించారు. 1962లో కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ సంపాదించారు. తరువాత టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా ఆయన పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన టాటా గ్రూప్‌నకు కూడా నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్‌ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్‌ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ను, 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారాలను అందించింది.

Related Posts
Dr. Venkat Ram Narsaya: వైల్డ్​ లైఫ్​ ఫొటోగ్రాఫర్​ డా.వెంకట్ రామ్​ నర్సయ్య ఇక లేరు
Dr. Venkat Ram Narsaya: వైల్డ్​ లైఫ్​ ఫొటోగ్రాఫర్​ డా.వెంకట్ రామ్​ నర్సయ్య ఇక లేరు

అరుదైన ప్రతిభాశాలి డాక్టర్ వెంకట్ రామ్ నర్సయ్యకు కన్నీటి వీడ్కోలు దేశంలోనే అగ్రగణ్య వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన డాక్టర్ వెంకట్ రామ్ నర్సయ్య మరణ వార్త Read more

Kasturirangan: కస్తూరి రంగన్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ
Kasturirangan: కస్తూరి రంగన్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ యొక్క మృతి భారతదేశం కోసం ఒక అద్భుతమైన విషాదం. Read more

చెన్నైలో భారీ వర్షాలు
WhatsApp Image 2024 12 12 at 12.22.31

దక్షిణ కోస్తా, రాయలసీమలలో వర్షాలు పడే అవకాశం గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం. దీని అనుబంధంగా మధ్య ట్రోపోఆవరణం వరకు Read more

వ్యవసాయ ఆవిష్కరణలలో అగ్రగామిగా క్రిస్టల్ క్రాప్ ప్రొటక్షన్
Crystal Crop Protection is a pioneer in agricultural innovation

న్యూఢిల్లీ : క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్, వ్యవసాయ ఆవిష్కరణలలో ఉంది. కొన్ని ఆసియా దేశాలలో విక్రయాల కోసం బేయర్ AG నుండి క్రియాశీల పదార్ధం Ethoxysulfuron Read more

Advertisements
×