Piyush Goyal breaks down re

రతన్ టాటా మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు.

ఇక రతన్ టాటాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఎమోషనల్ అయ్యారు. ‘నా ఆహ్వానం మేరకు ఆయన ఓరోజు మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశారు. చాలా సింపుల్గా ఉంటారాయన. వెళ్లేటప్పుడు “నాతో ఫొటో దిగుతారా?” అని నా భార్యను అడిగారు. రతన్ తో ఫొటో దిగాలని ఎవరికి ఉండదు?’ అంటూ పీయూష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అది తమకు ఎప్పుడూ గుర్తుండిపోయే జ్ఞాపకమని వివరించారు.

రతన్​ టాటా 1937 డిసెంబర్‌ 28న ముంబయిలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించారు. 1962లో కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ సంపాదించారు. తరువాత టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా ఆయన పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన టాటా గ్రూప్‌నకు కూడా నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్‌ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్‌ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ను, 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారాలను అందించింది.

Related Posts
తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది – కేటీఆర్
Will march across the state. KTR key announcement

కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన ట్వీట్ చేసారు. రియల్ ఎస్టేట్ రంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కేటీఆర్ చేసిన Read more

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భారతీయుల మృతి
Russia Ukraine war.. Indian

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటున్న వీరిలో ఇంకా 16 మంది అదృశ్యంగా ఉన్నారని Read more

జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసు.. పోలీసుల విచారణకు రాజ్‌పాకల
Janwada farmhouse case. Raj Pakala to police investigation

హైదరాబాద్‌: జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఈరోజు మోకిల పోలీసుల ముందు విచారణకు Read more

తెలంగాణ TSPSC గ్రూప్-III పరీక్షకు 50.7% హాజరు..
group 3 1

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-III పరీక్ష 2024 నవంబర్ 18, ఆదివారం ప్రారంభమైంది. ఈ పరీక్షలో 1,363 జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *