సిద్ధిపేట జిల్లాలో ఆత్మహత్యకు ట్రై చేసిన వ్యక్తి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని కొడకండ్ల శివారులో విషాదం చోటుచేసుకుంది. మాదాపూరానికి చెందిన ఎరుకుల రాజయ్య గౌడ్ (60) శుక్రవారం ఉదయం గొంతులో కత్తితో పొడుచుకుని ప్రాణాలు వదిలేందుకు సిద్ధపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేయగా వారు ఘటన స్థలానికి చేరుకున్నారు.

అనంతరం రాజయ్య గౌడ్‌ను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కుకునూరుపల్లి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే, రాజయ్య ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే విషయం తెలియాల్సి ఉంది.