పవన్ భార్య కు సింగపూర్ వర్సిటీ పట్టా

పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. సింగపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం సబ్జెక్టులో ఆమె మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అన్నా లెజినోవాకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. మాస్టర్స్ పట్టా పొందినందుకు పవన్ ఆనందం వెలిబుచ్చారు. రెండో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న భార్యకు అభినందనలు తెలిపారు.

అన్నా లెజినోవా గతంలో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఓరియంటల్ స్టడీస్ లో ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై పీటర్స్ బర్గ్ వర్సిటీ నుంచి డిగ్రీ అందుకున్నారు. థాయ్ లాండ్ చరిత్ర సబ్జెక్టులో స్పెషలైజేషన్ చేశారు. రష్యా యూనివర్సిటీలో ఉన్నప్పుడే ఆమె మూడు భాషలు నేర్చుకున్నారు.