Pawan Kalyan visit to Kadapa today

నేడు సాలూరులో పవన్ కల్యాణ్ పర్యటన

విశాఖ: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. నేడు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం పవన్‌ కల్యాణ్‌ గతరాత్రి గన్నవరం నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు. ఇక ఈరోజు ఉదయం పార్వతీపురం మన్యం జిలా పర్యటనకి విశాఖ నుంచి బయలుదేరారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా ముందుగా నిర్ణయించుకు ప్రకారం గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పర్యటనకి బయలు దేరారు.

ముందుగా ఆయన సాలూరు నియోజకవర్గం పనసభద్ర పంచాయతీ బాగుజోలకు వెళ్తారు. మన్యం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. దాదాపు 36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం పనులను పవన్ ప్రారంభిస్తారు. రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి కలుగనుంది. అక్కడ‌ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు. అనంతరం అక్కడ గిగిజనులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.. ఆ కార్యక్రమాలను ముగించుకొని తిరిగి సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు.

కాగా, రేపు కూడా సీఎం పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్రలోనే పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికారకు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎక్కువగా జిల్లాలు, నియోజకవర్గాల వారిగా పర్యటించేందుకు, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపేందుకు పవన్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడం పై ప్రజల్లోనూ, జనసేన వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. పవన్ పర్యటనల ద్వారా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం అవుతుందని, జనసేన గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Posts
సైబర్ నేరాలకు వ్యతిరేకంగా TGCSB ‘షీల్డ్’
సైబర్ నేరాలకు వ్యతిరేకంగా TGCSB 'షీల్డ్'

TGCSB 'షీల్డ్' సురక్షితమైన మరియు స్థితిస్థాపకమైన డిజిటల్ భవిష్యత్తును నిర్మించడానికి కలిసి పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైబర్ క్రైమ్ మరియు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో Read more

నిర్దేశిత కక్ష్యలోకి చేరని ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం..!
NVS 02 satellite that did not reach the specified orbit.

న్యూఢిల్లీ: ఇస్రో గత బుధవారం చేపట్టిన 100వ ప్రయోగానికి అనుకోని అడ్డంకులు ఏర్పడ్డాయి. అంతరిక్షంలోకి పంపిన ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో తాజాగా ప్రకటించింది. Read more

షేక్ హసీనా వీసాను పొడిగించిన భారత్
షేక్ హసీనా వీసాను పొడిగించిన భారత్

బంగ్లాదేశ్ నుండి పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో షేక్ హసీనాను అప్పగించాలని వచ్చిన అంశం పై ఈ చర్య తీసుకోబడింది. అయితే, హసీనాకు ఆశ్రయం ఇచ్చారు అన్న వాదనలను Read more

టీడీపీలోకి కరణం బలరామ్.. ?
karanam balaram

వైసీపీ సీనియర్ నేత కరణం బలరామ్ పార్టీ మారతారని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన త్వరలోనే టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *