BJP protests in Telangana from 30th of this month 1

నేడు ప్రధాని మోడీతో సమావేశం కానున్న పవన్‌ కల్యాణ్

న్యూఢిల్లీ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతుంది. నిన్న వరుసగా పలువురు కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈరోజు (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించనున్నారు. జల్ జీవన్ మిషన్ స్కీమ్‌లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేయనున్నారు.

పవన్ అభ్యర్ధనల పైన కేంద్ర మంత్రులు వెంటనే స్పందించి ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హర్యానాలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సమయంలో ప్రధానిని పవన్ కలిసారు. ఆ తరువాత ఇప్పుడు పవన్ భేటీ కానున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. కేంద్రం జమిలి దిశగా అడుగులు వేస్తున్న వేళ వ్యూహాత్మకంగా నే ఈ భేటీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. పవన్ ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం ఇవ్వటం ద్వారా రానున్న రోజుల్లో పవన్ సేవలను ఎన్డీఏ బలోపేతానికి వినియోగించుకోవాలనేది బీజేపీ వ్యూహం గా స్పష్టం అవుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్ధులకు మద్దతుగా పవన్ ప్రచారం చేసారు. ఆ సమయంలో వచ్చిన స్పందన పైన బీజేపీ ముఖ్య నేతలు ఆరా తీసారు. ప్రధాని మోడీ పైన పవన్ పలు సందర్భాల్లో విధేయత చాటుకున్నారు. ఇక..డిప్యూటీ సీఎం అయిన తరువాత ఆ హోదాలో ప్రధానితో ఒన్ టు ఒన్ సమావేశం కావటం ఇదే తొలి సారి. పవన్ ను దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రచార కర్తగా వినియోగించుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

Related Posts
హోంమంత్రికి షాక్ ఇచ్చిన చంద్రబాబు
హోంమంత్రికి షాక్ ఇచ్చిన చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నుంచి పదేపదే హెచ్చరికలు ఉన్నప్పటికీ, కొంతమంది మంత్రులు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అలాంటి Read more

భారత్‌కు యుద్ద ముప్పు .. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
భారత్‌కు యుద్ద ముప్పు .. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

భారత్‌కు యుద్ద ముప్పు .. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు భారత్‌కు ఇద్దరు పొరుగు దేశాల నుంచి ఒకేసారి యుద్ధ ముప్పు పెరుగుతోందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర Read more

3 రోజుల్లో రూ.216 కోట్లు విడుదల చేస్తాం: మంత్రి లోకేశ్
lokesh 2 300cr

ఇంజినీరింగ్ విద్యా రంగంలో నాణ్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం పూర్తి కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీల సంఘం Read more

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
nirmala sitharaman

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ Read more