రేపటి నుండి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష

ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపటి నుండి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు చేప్ట‌ట‌నున్న ఈ దీక్ష‌లో భాగంగా పాలు, పండ్లు, లిక్విడ్ ఫుడ్ ను మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.

ఈసారి ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజులపాటు దీక్షలో ఉంటారు. పవన్ కళ్యాణ్‌కు దైవ భక్తి ఎక్కువ అని చెబుతారు.. ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో.. ఈ ఏడాది కూడా దీక్ష చేపట్టబోతున్నారు.