Pawan Kalyan responded to Adanis issue

అదానీ అంశంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అదానీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్ తో పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని… అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింస చాలా బాధాకరం. తీవ్ర ఆవేదన చెందుతున్నామని… బంగ్లాదేశ్ ఏర్పడిందే భారత సైన్యం త్యాగాలతో అన్నారు. భారత్ లో మైనార్టీలను ఎలా చూస్తున్నాం, అక్కడ మైనార్టీ హిందువులను ఎలా చూస్తున్నారు? అని ఆగ్రహించారు.

పాలస్తీనా లో ఏదైనా జరిగితే స్పందించే ప్రముఖులు, బంగ్లాదేశ్ లో జరిగే అంశాలపై ఎందుకు స్పందించరు అంటూ ప్రశ్నించారు. ₹110 కోట్ల ఎర్ర చందనం దుంగలను కర్ణాటకలో దొరికితే, వాటిని ఆ రాష్ట్రం అమ్మేసిందని… అదే ఎర్ర చందనం ఇతర దేశాల్లో దొరికితే తిరిగి తెప్పించుకోవచ్చు అన్నారు. నేపాల్ నుంచి కూడా అలాగే రప్పించామని…విదేశాల విషయంలో ట్రీటీ ఉన్నట్టు పొరుగు రాష్ట్రాల్లో దొరికినప్పుడు ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికి చేరవేసే విధానం లేదని వివరించారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి తో మాట్లాడాను. సొంత రాష్ట్రానికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని కోరానని వివరించారు. అదానీ పవర్ విషయంలో లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి… ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాల్సి ఉందన్నారు.

Related Posts
చైనా స్పేస్ రంగంలో నూతన ఆవిష్కరణ..
satellite

చైనా ప్రపంచంలో తొలి "సెల్ఫ్ డ్రైవింగ్ " ఉపగ్రహాలను విజయవంతంగా ప్రారంభించింది. ఇది దేశం యొక్క వాణిజ్య అంతరిక్ష కార్యక్రమంలో ఒక మైలురాయి అని "సౌత్ చైనా Read more

సికెల్‌ సెల్‌ అవగాహన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించిన సికెల్‌ సెల్‌ సొసైటీ
Sickle Cell Society organized special programs on the occasion of Sickle Cell Awareness Day

హైదరాబాద్‌ : అక్టోబర్‌ నాల్గవ శనివారాన్ని ప్రతి సంవత్సరం సికెల్‌ సెల్‌ అవగాహన దినంగా జరుపుతుంటారు. దానిలో భాగంగా నేడు (అక్టోబర్‌ 26)న తలసేమియా అండ్‌ సికెల్‌ Read more

గాంధీభవన్‌లో కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
Youth Congress leaders who

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో రసాభాస పరిస్థితి చోటు చేసుకుంది. సమావేశం సందర్భంగా నేతల మధ్య మాటామాటా పెరిగి తిట్టుకుంటూ, Read more

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు మృతి
Road accident in America. Five Indians died

రోడ్డు ప్రమాదాలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారింది. ఇవి ప్రమాదకరమైన పరిస్థితులు, మరణాలు, గాయాలు, ఆర్థిక నష్టం మరియు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *