Pawan Kalyan: కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

Pawan Kalyan: కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సమయంలో, ఆ ఘటనపై కొందరు కాంగ్రెస్ నేతలు చూపిన ప్రవర్తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నివసిస్తూ విదేశీ శత్రు దేశమైన పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

Advertisements

పవన్ కల్యాణ్ ఆగ్రహం

మన దేశంలో పుట్టి, మన దేశంలో ఉంటూ కొందరు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లు సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారు? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇది దేశభక్తికి, జాతీయ ఐక్యతకు మచ్చలు పడేలా చేస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి. ఎక్కువ మంచితనం చూపిస్తే, శత్రువు ఇంటికొచ్చి కాల్చేస్తాడు అని హెచ్చరించారు. దేశ భద్రతకు ఎవరైనా, ఎప్పుడైనా ప్రమాదం కలిగిస్తే, దానిని క్షమించరాదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ, మతం పేరుతో రాజకీయ లాభాలు పొందే ప్రయత్నం చేయడం సరికాదు. కశ్మీర్ భారతదేశంలో భాగం. ఇలాంటి అంశాల్లో రాజకీయం చేయడం అత్యంత ప్రమాదకరం, అన్నారు. ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని కొందరు ఇండియాలో ఉండి పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నారు. పాకిస్తాన్‌ను ప్రేమించేవాళ్లు ఆ దేశానికి వెళ్లిపోవచ్చంటూ పవన్ సూచించారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని కశ్మీర్‌ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదంటూ పవన్ చెప్పారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సెక్యులరిజం పేరుతో కొందరు సౌత్ కాంగ్రెస్ నేతలు పాక్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు..

మధుసూదన్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం

పహల్గామ్ ఘటనలో హతమైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మధుసూదన్ కుటుంబానికి జనసేన తరపున రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు పవన్ కల్యాణ్. కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా, మధుసూదన్ పిల్లలకు అవసరమైన మానసిక మద్దతు కూడా అందిస్తామని తెలిపారు. సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ తన కుమారుడికి ఇప్పుడు అర్ధరాత్రి మేడపై నుంచి పడిపోతున్నట్టు కలలు వస్తున్నాయని అలాంటిది మధుసూదన్ పిల్లలకు ఎలాంటి ట్రామా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం రావచ్చు, రాకపోవచ్చు కానీ అందరూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికైనా సిద్ధం కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అతి మంచితనం చూపిస్తే ఇంటికొచ్చి కాల్చేస్తారన్నారు. భారతదేశంలో దాడి జరిగినప్పుడు సెక్యులరిజం అంటూ కాంగ్రెస్ నాటకాలు వేస్తే అంగీకరించేది కాదు. మతం ప్రాతిపదికన చంపుతాం అంటే చూస్తూ ఊరుకోము. అని హితవు పలికారు.

read also: Pahalgam Attack : ఉగ్రదాడి బాధిత కుటుంబానికి పవన్ రూ.50 లక్షల సాయం

Related Posts
YCP: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్
YCP petitions Supreme Court on Waqf Amendment Act

YCP : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కూడా తీసుకున్న వక్ఫ్ చట్టంపై ఏపీలో విపక్ష వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు Read more

Eatala Rajendar: బీజేపీ అధ్యక్ష పదవీ పై ఈటల కీలక వ్యాఖ్యలు
Key comments by Eatala Rajender on BJP president

Eatala Rajendar: బీజేపీ అధ్యక్ష పదవి మార్పు ఎప్పుడూ ఉంటుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు పార్టీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. మా పార్టీలో అధ్యక్షులు Read more

India Summit : రాజకీయాల్లోకి కొత్తతరం రావాలి – రాహుల్
rahul

హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు Read more

చంద్రబాబు ను కలిసిన బిఆర్ఎస్ నేతలు
tigala krishnareddy

మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డిలు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా తీగల..తాను టిడిపిలో చేరబోతున్నట్లు తెలిపాడు. సోమవారం జూబ్లీహిల్స్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×