ఎల్లుండి ఢిల్లీకి పవన్ కళ్యాణ్

ఈ నెల 19న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ రోజు అక్కడ జరిగే జలజీవన్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి హోదాలో పవన్ హాజరుకానున్నారు. కాగా తొలిసారి కేంద్ర మంత్రితో సమీక్షకు హాజరుకానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన జల జీవన్ మిషన్ పథకం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తున్నారనే దానిపై దృష్టి సారించింది. అందులో భాగంగా శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే తొలిసారి కేంద్ర మంత్రితో సమీక్షకు హాజరుకానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈక్రమంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.