కాంగ్రెస్‌లోకి గూడెం మహిపాల్ రెడ్డి..?

కాంగ్రెస్ పార్టీలోకి బిఆర్ఎస్ నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీకి సంబదించిన 09 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగా..ఇప్పుడు మరో ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. శనివారం ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరారు.

శనివారం సాయంత్రం పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. దీంతో ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడినట్లు మహిపాల్ రెడ్డి ఫై ఆరోపణలు రావడం తో ఈడీ సోదాలు జరిపి..అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది. ఆ తర్వాత ఈడీ విచారణ కు సైతం మహిపాల్ హాజరయ్యారు.