Palnadu: పదో తరగతిలో ప్రతిభ చాటిన అమూల్యకు ఎకరం పొలం

Palnadu: పదో తరగతిలో ప్రతిభ చాటిన అమూల్యకు ఎకరం పొలం

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన అమూల్య అనే పది తరగతి విద్యార్థిని తన ప్రతిభతో ప్రతి ఒక్కరిని అబ్బురపరిచింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆమె అత్యుత్తమంగా – మొత్తం 600 మార్కుల్లో 593 మార్కులు సాధించి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. గ్రామీణ ప్రాంతంలో, తీవ్ర ఆర్థిక కష్టాల్లోనూ, సాధించిన ఈ విజయం నిజంగా స్ఫూర్తిదాయకం.

Advertisements

ప్రతిభను గుర్తించిన కలెక్టర్

అమూల్య విజయవార్త తెలుసుకున్న పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు IAS గారు ఆమెను వ్యక్తిగతంగా అభినందించారు. ఆమె కుటుంబ స్థితిగతులను వివరంగా తెలుసుకున్న ఆయన, అమూల్య తల్లిదండ్రులు అనిల్, రూతమ్మలు రోజువారీ కూలి పనులతో జీవనం సాగిస్తుండగా, ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నత శిక్షణ సదుపాయాల లేని పరిస్థితుల్లో కూడా కుమార్తె చదువులో రాణించిందని తెలుసుకుని ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అమూల్య తల్లిదండ్రులు అనిల్, రూతమ్మలు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబంలో మరో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.

భూమి లేని నిరుపేదల పథకం కింద ఎకరం భూమి మంజూరు

అమూల్య కుటుంబానికి భూమి లేదన్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ గారు భూమి లేని నిరుపేదల పథకం కింద ఎకరం పొలం మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇది ఆ కుటుంబానికి ఊహించని వరం. కేవలం విద్యను ప్రోత్సహించడమే కాకుండా, ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాన్ని కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న గొప్పతనం. కలెక్టర్ ప్రకటనపై అనిల్, రూతమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే భూమిని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తామని వారు తెలిపారు.

Read also: Adinarayana Reddy: జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డి

Related Posts
Andhra University: ఉద్రిక్తతల నేపథ్యంలో ఆంధ్ర వర్సిటీ హాస్టళ్ల మూసివేత
Andhra University

భద్రతా పరిస్థితుల దృష్ట్యా కీలక నిర్ణయం – విద్యార్థుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర Read more

ముగిసిన వంశీ మూడు రోజుల కస్టడీ విచారణ
vallabhaneni vamsi three day custody has ended

కృష్ణలంక పీఎస్ లో వంశీని విచారించిన పోలీసులు అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజుల కస్టడీకి కోర్టు Read more

KTR : ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
KTR ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

KTR : ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చామంటూ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇదే ఇందిరమ్మ పాలన Read more

పెద్దపల్లి శివాలయంలో నాగదేవత విగ్రహం వద్ద నాగుపాము దర్శనం – భక్తుల ఉత్సాహం
ఓదెల శివాలయంలో మహాశివరాత్రి రోజున నాగుపాము దర్శనం

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని ప్రసిద్ధ శివాలయంలో ఒక అపూర్వ సంఘటన చోటు చేసుకుంది. శివాలయ ఆవరణలో ఉన్న నాగదేవత Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×