పాకిస్థాన్లో సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఘటనకు ముగింపు పలికేలా ఆర్మీ విజయవంతమైన ఆపరేషన్ను నిర్వహించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులను కాపాడేందుకు పాక్ భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ ఘనవిజయం సాధించింది. ఈ ఘటనలో మొత్తం 33 మంది బీఎల్ఏ మిలిటెంట్లు హతమయ్యారు. అయితే, ఈ ఎదురుకాల్పుల్లో 21 మంది సాధారణ ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, మిగిలిన ప్రయాణికులను సురక్షితంగా రక్షించామని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ప్రకటించారు.
హైజాక్ ఘటన
బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు జాఫర్ ఎక్స్ప్రెస్ నిన్న ఉదయం 9గంటలకు బయలుదేరింది. సుమారు 500 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలుపై రిమోట్ ప్రాంతమైన బలోన్లో 8వ నంబర్ టన్నెల్ దగ్గర మిలిటెంట్లు కాల్పులు జరిపారు. రైలు ట్రాక్ను పేల్చివేసి ట్రైన్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తమ దగ్గర 214 మంది బందీలుగా ఉన్నట్లు తెలిపిన మిలిటెంట్ సంస్థ30 మంది పాక్ సైనికులను చంపినట్లు పేర్కొంది. అయితేతమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలుగా ఉన్నవారందరినీ చంపుతామని బెదరించింది. బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్థులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆపరేషన్
రంగంలోకి దిగిన ఆర్మీ విజయవంతంగా ఆపరేషన్ను ముగించి, రైలును తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. మంగళవారం సాయంత్రానికి 100 మంది ప్రయాణికులను రక్షించిన భద్రతా బలగాలు, నిన్న మిగతా ప్రయాణికులను రక్షించాయి.
హైజాక్ వెనుక కారణాలు
బలూచిస్థాన్ పాకిస్థాన్ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. గ్యాస్, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతమైనప్పటికీ దోపిడీకి గురవుతున్నామని వాదిస్తోంది. ఈ క్రమంలోనేబలోచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో 2000లో ఏర్పాటైన సంస్థ స్థానికంగా బలీయ శక్తిగా ఎదిగింది. పాక్ సైన్యం, ప్రభుత్వంపై తరచూ దాడులకు పాల్పడుతున్న ఈ సంస్థను పాకిస్థాన్తో పాటు అమెరికా, బ్రిటన్లు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి.

బలూచ్ గ్రూపులు పాకిస్తాన్ – చైనాపై కొత్త దాడిని ప్రకటించాయి. బలూచ్ యోధులు ఇటీవల సింధీ వేర్పాటువాద గ్రూపులతో విన్యాసాలు ముగించారు. ఇప్పుడు తిరుగుబాటు సంస్థలు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. సింధీ, బలూచ్ సంస్థలు కలిసి రావడం వల్ల పాకిస్తాన్లోని ప్రాజెక్టులకు పెద్ద ముప్పు ఏర్పడింది.