కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భరత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పోర్టల్ వెబ్సైట్ ఒక్కసారి క్రాష్ అయ్యింది. వరుసగా రెండు రోజుల పాటు PSX ఇండెక్స్ తీవ్ర పతనాన్ని చుసిన తర్వాత ఇవాళ వెబ్సైట్ క్రాష్ అయింది. నిన్న గురువారం, KSE-100 ఇండెక్స్ ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి ఐదు నిమిషాల్లోనే 2.12% అంటే 2,485.85 పాయింట్లు కుప్పకూలి 114,740.29 వద్ద ముగిసింది. బుధవారం కూడా ఇదే విధమైన పతనం తర్వాత, కేవలం రెండు రోజుల్లోనే మొత్తం 2,500 పాయింట్లకు పైగా క్షీణత నమోదైంది.

గురువారం కూడా కొనసాగి తీవ్ర క్షీణత
PSX వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే “WE’LL BE BACK SOON” అని ఒక మెసేజ్ చూపిస్తుంది, అలాగే నెక్స్ట్ నోటీసు వచ్చే వరకు మెయింటెనెన్స్’లో ఉందని సూచిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ GDP వృద్ధి అంచనాను 2.6%కి తగ్గించిన తర్వాత బుధవారం PSX నష్టాల్లో ముగిసింది, అంతేకాక ఈ పతనం గురువారం కూడా కొనసాగి తీవ్ర క్షీణత సంభవించింది.
పాకిస్తానీ జాతీయులకు వీసాల రద్దు
పాకిస్తాన్ కరెన్సీ బలహీనపడటం, రాజకీయ అనిశ్చితి కొనసాగడం, పెరుగుతున్న భద్రతా ప్రమాదాలు ముఖ్యంగా కాశ్మీర్లో ఆర్థిక మార్కెట్లలో సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయని ఫిచ్ రేటింగ్స్ తాజాగా ఆందోళనలను వ్యక్తం చేసింది. కాశ్మీర్ ఫాల్గమ్ దాడికి బదులుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కఠినమైన చర్యలు ప్రకటించింది, వాటిలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, వాఘా-అట్టారి బార్డర్ ద్వారా వాణిజ్యాన్ని వెంటనే మూసివేయడం, సార్క్ కింద పాకిస్తానీ జాతీయులకు వీసాల రద్దు వంటివి ఉన్నాయి.
ఈ ఉద్రిక్తతల మధ్య ఇవాళ భారతదేశ దలాల్ స్ట్రీట్ కూడా దాదాపు 500 పాయింట్లు పడిపోయింది.
Read Also: Donald Trump: పహల్గాం దాడి..భారత్కు అండగా ఉంటామన్న ట్రంప్