Pakistan Minister : అణ్వాయుధాలతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న పాక్ మంత్రి

Pakistan Minister : అణ్వాయుధాలతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న పాక్ మంత్రి

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సరిహద్దుల్లో ఏక్షణంలో అయినా యుద్ధం రావచ్చు అనేలా ఉంది వాతావరణం ఇలాంటి పరిస్థితుల్లో పాక్ నేతలు తమ నోటి దురుసుతో మరింత ఉద్రిక్తత రాజేస్తున్నారు. ఇక తాజాగా పాకిస్తాన్ మినిస్టర్ ఒకరు భారత్‌పై న్యూక్లియర్ బాంబులతో దాడి చేస్తామని బహిరంగంగా హెచ్చరించారు. 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ కేవలం ఇండియా కోసమే వేచి ఉన్నాయన్నారు.భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ ఇప్పుడు బహిరంగ బెదిరింపులకు దిగింది. అణ్వాయుధాలతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసి బహిరంగంగా ప్రకటించారు. ఘోరీ, షాహీన్, ఘజ్నవి వంటి క్షిపణులతోపాటు 130 అణ్వాయుధాలను భారత్ కోసం మాత్రమే ఉంచినట్టు పేర్కొన్నారు. 

Advertisements

రెచ్చెగొట్టే

అంతేకాక భారత్ కనుక సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసి నీటి సరఫరాను అడ్డుకుంటే అప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధం కావాలని సూచించారు. పాక్ అణ్వాయుధాలను వాడుతుందని రహస్యంగా దేశంలోని పలు ప్రాంతాల్లో వాటిని దాచి ఉంచామని భారత్ రెచ్చెగొట్టే చర్యలకు పాల్పడితే వాటిని ప్రయోగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తమ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదని వాటన్నింటిని భారత్‌వైపు సంధించి పెట్టామని హనిఫ్ అబ్బాసి చెప్పుకొచ్చారు.సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దుచేసి తమకు రావాల్సిన నీటి సరఫరాను ఆపితే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హనీఫ్ అబ్బాసి హెచ్చరించారు. 

 Pakistan Minister : అణ్వాయుధాలతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న పాక్ మంత్రి

భారత విమానయానరంగం

పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత్.. పాక్‌పై చర్యలకు సిద్ధమైంది. దానిలో భాగంగా 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో పాటుగా భారత్‌లో ఉన్న పాకిస్థానీయుల వీసాలు రద్దు చేసింది. అలానే పాకిస్థాన్‌తో వాణిజ్య ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది.ఇక భారత్ చర్యలకు బదులుగా పాకిస్తాన్ భారతీయ యుద్ధ విమానాలను తమ గగనతలంలోకి రాకుండా బ్యాన్ చేసింది. దీనిపై హనిఫ్ స్పందిస్తూ మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే భారత విమానయానరంగంలో ఆందోళనలు మొదలవుతాయి. మరో పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఇండియాలోని విమానాయాన సంస్థలు దివాళా తీస్తాయి అని చెప్పుకొచ్చారు. పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్‌ను నిందించడం సరికాదన్నారు హనిఫ్ అబ్బాసి. భారత్ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని చెప్పుకొచ్చారు. భారత్ నిర్ణయాలకు కౌంటర్ ఇచ్చేందుకు పాకిస్థాన్ కూడా సిద్ధంగా ఉందని పాక్ ఎలాంటి చర్యలకైనా వెనకాడదని వెల్లడించారు. ఇక రెండు రోజుల క్రితం పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ మాట్లాడుతూ అమెరికా, పశ్చిమ దేశాల కోసం పాకిస్థాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మద్దతుగా ఉందని తెలుపుకొచ్చాడు. అమెరికా, పశ్చిమ దేశాల కోసం తాము ఆ నీచానికి పాల్పడినట్లు వెల్లడించారు.

Read Also: Food Shortage : పాక్ ఆర్థిక వృద్ధిరేటు 2.7 శాతానికి తగ్గింపు

Related Posts
IPL 2025: ఆర్‌సీబీ ఓటమికి కారణాలు ఇవే!
IPL 2025: ఆర్‌సీబీ ఓటమికి కారణాలు ఇవే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ లో ప్రత్యర్థులను వారి సొంత వేదికలపై చిత్తు చేస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ సొంత వేదికపై Read more

Accident: కర్ణాటకలోని చిత్రదుర్గలో గోర ప్రమాదం డ్రైవరుతో సహా మృతి
Accident: కర్ణాటకలోని చిత్రదుర్గలో గోర ప్రమాదం డ్రైవరుతో సహా మృతి

ఘటన వివరాలు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో సుమారు Read more

రైలు హైజాక్ ఘటన.. బలూచ్ ఆర్మీ వీడియోను విడుదల
రైలు హైజాక్ ఘటన.. బలూచ్ ఆర్మీ వీడియోను విడుదల

పాకిస్థాన్ లోని బలూచిస్థాన్‌లో క్వెట్టా నుంచి పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు ఇప్పటికీ బలూచ్ తిరుగుబాటుదారుల ఆధీనంలోనే ఉంది. ఇప్పటివరకు 150 మందికి Read more

NarendraModi: ఏప్రిల్ 3 న థాయ్‌లాండ్, శ్రీలంకలో మోదీ పర్యటన..
NarendraModi: ఏప్రిల్ 3 న థాయ్‌లాండ్, శ్రీలంకలో మోదీ పర్యటన..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3 నుండి 6 వరకు థాయ్‌లాండ్, శ్రీలంక పర్యటనలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×