పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లో భయం మొదలైందా..? భారత్ కఠిన వైఖరితో దాయాది దేశం వణికిపోతోందా? అగ్రదేశాలన్నీ భారత్కు మద్దతుగా నిలుస్తుండడంతో పొరుగు దేశాలతో పాక్ కాళ్ల కింద భూకంపం వచ్చినంత పని అవుతోంది. ఆపరేషన్ త్రిశూల్. చుక్క నెత్తురు చిందించకుండానే పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది భారత్. డైరెక్ట్ వార్ చేయకుండానే, పరోక్ష యుద్ధంతో పాక్ని షేక్ చేస్తోంది. ఈ ముప్పేట దాడితో పాక్ విలవిల్లాడిపోతోంది. మొన్న వాటర్ బాంబ్ ఒత్తిని అంటించింది భారత్. అది ఇప్పుడు పేలడంతో పాక్ బెంబేలెత్తిపోతోంది. ఇక టెర్రరిస్టులకు తల దాచుకునేందుకు వీలు లేకుండా వేటలో వేగం పెంచింది.

పాకిస్థాన్ పట్ల కఠిన వైఖరి
పహల్గామ్ ఘటనను సీరియస్గా తీసుకున్న భారత్, పాకిస్థాన్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇప్పటికే వీసాలు రద్దు చేసి దేశం నుంచి పాకిస్థానీయులను పంపించేసిన భారత్, ఉగ్రవాదులను తుదముట్టించేందుకు అన్ని శక్తులు ప్రయోగిస్తోంది. తమ పాత్రేమీ లేదంటూ ఒకరోజు.. యుద్ధానికి సిద్ధమంటూ మరోసారి వ్యాఖ్యలు చేస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అయితే పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు మాత్రమే కాదు, దాని అగ్ర నాయకులు, అధికారులు కూడా భారత్ ప్రతీకార చర్యకు భయపడుతున్నారు. స్థానిక కథనాల ప్రకారం, పాకిస్తాన్ సైనిక అధిపతి కుటుంబం పాకిస్థాన్ విడిచిపెట్టిన తర్వాత, ఇప్పుడు పిపిపి అధ్యక్షుడు బిలావల్ భుట్టో కుటుంబం కూడా పాకిస్తాన్ విడిచి కెనడా వెళ్లిపోయింది.
నిలిపివేసిన పాకిస్థానీల వీసాలు
వారితో పాటు, పాక్ జాయింట్ చైర్పర్సన్ షంషాద్ మీర్జాతో సహా అనేక మంది ముఖ్య అధికారుల కుటుంబాలు దేశం విడిచి వెళ్లినట్లు సమాచారం. దీన్ని బట్టి భారతదేశం ప్రతీకార చర్య కారణంగా పాకిస్తాన్లో ఎంత భయం వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు.
Read Also: Asaduddin Owaisi: షాహిద్ ఆఫ్రిదిపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు