పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లో భయం మొదలైందా..? భారత్‌ కఠిన వైఖరితో దాయాది దేశం వణికిపోతోందా? అగ్రదేశాలన్నీ భారత్‌కు మద్దతుగా ..

Pahalgam Attack: పరోక్ష యుద్ధంతో వణికిపోతున్న పాకిస్తాన్‌..అగ్రదేశాలన్నీ భారత్‌కు మద్దతు

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లో భయం మొదలైందా..? భారత్‌ కఠిన వైఖరితో దాయాది దేశం వణికిపోతోందా? అగ్రదేశాలన్నీ భారత్‌కు మద్దతుగా నిలుస్తుండడంతో పొరుగు దేశాలతో పాక్‌ కాళ్ల కింద భూకంపం వచ్చినంత పని అవుతోంది. ఆపరేషన్‌ త్రిశూల్. చుక్క నెత్తురు చిందించకుండానే పాకిస్తాన్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది భారత్‌. డైరెక్ట్‌ వార్‌ చేయకుండానే, పరోక్ష యుద్ధంతో పాక్‌ని షేక్‌ చేస్తోంది. ఈ ముప్పేట దాడితో పాక్‌ విలవిల్లాడిపోతోంది. మొన్న వాటర్‌ బాంబ్‌ ఒత్తిని అంటించింది భారత్. అది ఇప్పుడు పేలడంతో పాక్‌ బెంబేలెత్తిపోతోంది. ఇక టెర్రరిస్టులకు తల దాచుకునేందుకు వీలు లేకుండా వేటలో వేగం పెంచింది.

Advertisements
పరోక్ష యుద్ధంతో వణికిపోతున్న పాకిస్తాన్‌..అగ్రదేశాలన్నీ భారత్‌కు మద్దతు

పాకిస్థాన్ పట్ల కఠిన వైఖరి
పహల్గామ్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత్, పాకిస్థాన్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇప్పటికే వీసాలు రద్దు చేసి దేశం నుంచి పాకిస్థానీయులను పంపించేసిన భారత్, ఉగ్రవాదులను తుదముట్టించేందుకు అన్ని శక్తులు ప్రయోగిస్తోంది. తమ పాత్రేమీ లేదంటూ ఒకరోజు.. యుద్ధానికి సిద్ధమంటూ మరోసారి వ్యాఖ్యలు చేస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అయితే పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు మాత్రమే కాదు, దాని అగ్ర నాయకులు, అధికారులు కూడా భారత్ ప్రతీకార చర్యకు భయపడుతున్నారు. స్థానిక కథనాల ప్రకారం, పాకిస్తాన్ సైనిక అధిపతి కుటుంబం పాకిస్థాన్ విడిచిపెట్టిన తర్వాత, ఇప్పుడు పిపిపి అధ్యక్షుడు బిలావల్ భుట్టో కుటుంబం కూడా పాకిస్తాన్ విడిచి కెనడా వెళ్లిపోయింది.
నిలిపివేసిన పాకిస్థానీల వీసాలు
వారితో పాటు, పాక్ జాయింట్ చైర్‌పర్సన్ షంషాద్ మీర్జాతో సహా అనేక మంది ముఖ్య అధికారుల కుటుంబాలు దేశం విడిచి వెళ్లినట్లు సమాచారం. దీన్ని బట్టి భారతదేశం ప్రతీకార చర్య కారణంగా పాకిస్తాన్‌లో ఎంత భయం వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు.

Read Also: Asaduddin Owaisi: షాహిద్ ఆఫ్రిదిపై అస‌దుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు

Related Posts
జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాపణ ఇచ్చినట్టు వైట్ హౌస్ ప్రకటన
joe biden scaled

డిసెంబర్ 1న, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు సంబంధించిన ఫెడరల్ గన్ మరియు పన్నుల నేరాలకు సంబంధించిన శిక్షలను "పూర్తిగా మరియు Read more

Toll Plaza:మే 1 నుంచి టోల్ ప్లాజా కొత్త రూల్స్
Toll Plaza:మే 1 నుంచి టోల్ ప్లాజా కొత్త రూల్స్

భారత రవాణా రంగంలో మరో ముఖ్యమైన మార్పు రాబోతున్నది. భారత్ లో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానం ప్రస్తుతం Read more

Pak, Bangladesh: పాక్, బంగ్లా సరిహద్దుల్లో భారత్ మరింత కట్టుదిట్టం
పాక్, బంగ్లా సరిహద్దుల్లో భారత్ మరింత కట్టుదిట్టం

భారత్ – పాకిస్తాన్ సరిహద్దులతో పాటు భారత్ – బంగ్లా సరిహద్దుల్లో పహారా బాధ్యతలు నిర్వర్తించే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)ను మరింత బలోపేతం చేసే దిశగా Read more

India-Pakistan : కాల్పుల విరమణ ఒప్పందం… అసలేం జరిగింది?
India Pakistan కాల్పుల విరమణ ఒప్పందం... అసలేం జరిగింది

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ, ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అచ్చం సినిమాల్లోలాగానే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ట్వీట్ ద్వారా "కాల్పుల విరమణ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×