తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో తలపడుతున్న పాకిస్తాన్

తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో తలపడుతున్న పాకిస్తాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫస్ట్ మ్యాచ్ ఆరంభంలోనే డ్రామా నడించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. షాహీన్ షా అఫ్రిది వేసిన రెండో బంతిని కివీస్ బ్యాటర్ విల్ యంగ్ ఎక్స్‌ట్రా కవర్‌లోకి నెట్టాడు. బౌండరీ వైపు వెళ్తున్న ఆ బంతిని ఆపే యత్నంలో ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. ఆ బంతికి న్యూజిలాండ్ బ్యాటర్లు మూడు పరుగులు తీశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభంలోనే తమ ప్లేయర్ గాయపడటంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బౌండరీ దగ్గర కాలి మడమ గాయమైనట్లు తెలుస్తోంది.

పాక్-భారత్ మధ్య హై ఓల్టేజీ

బంతిని మరో ఫీల్డర్‌కి అందించి బౌండరీ బయట కూర్చున్నాడు. ఫిజియో వచ్చి చూసినా లాభం లేకపోవడంతో గ్రౌండ్‌ని విడవాల్సి వచ్చింది. ఫఖర్ జమాన్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా కమ్రాన్ గులామ్ ఫీల్డింగ్‌కి వచ్చాడు. పాకిస్తాన్ ఓపెనర్ బ్యాటర్ ఫఖర్ జమాన్‌కి ఇలా కావడంతో పాక్ ప్లేయర్లు కూడా టెన్షన్ అవుతున్నారు. ఫఖర్ జమాన్ కోలుకోకపోతే పాకిస్తాన్ జట్టుకు చాలా ఇబ్బందనే చెప్పొచ్చు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం పాక్-భారత్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. భారత్‌పై ఫఖర్ జమాన్‌కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. మ్యాచ్‌ని సైతం మలుపుతిప్పే బ్యాటింగ్ ఫకర్ జమాన్‌ది. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించాలని పాకిస్తాన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో తలపడుతున్న పాకిస్తాన్

టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చేసింది. తొలి మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ ఏలో భాగంగా న్యూజిలాండ్‌తో తలపడుతోంది పాకిస్తాన్. కరాచీ స్టేడియం దీనికి వేదిక. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.

Related Posts
రేపు దాయాదుల పోరు అభిమానుల్లో ఉత్కంఠత
రేపు దాయాదుల పోరు అభిమానుల్లో ఉత్కంఠత

క్రికెట్ ప్రేమికులు ఎన్నో క్షణాల నుండి ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. రేపు, దుబాయ్ వేదిక‌గా భారత్, పాక్ జట్ల ముఖాముఖీ అవ్వబోతున్నాయి. క్రికెట్ ప్రపంచంలో Read more

ప్రపంచ వికలాంగుల దినోత్సవం 2024..
Persons with Disabilities

ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల దినోత్సవం ను జరుపుకుంటారు. ఈ రోజు, వికలాంగులకు సమాజంలో సమాన హక్కులు, అవకాశాలు మరియు గౌరవం ఇవ్వడానికి Read more

ఖో-ఖో ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘన విజయం
ఖో ఖో ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘన విజయం

ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన పురుషుల ఖో-ఖో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.నేపాల్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో భారత Read more

COP29 సదస్సు: $300 బిలియన్ల నిధుల వాగ్దానం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద సహాయం
COP29 Baku

COP29 క్లైమేట్ సమ్మిట్ అజర్బైజాన్‌లో తీవ్రమైన వాదనలు జరిగిన తర్వాత ఒక అంగీకారానికి వచ్చింది. ఈ సదస్సు 33 గంటలు ఆలస్యంగా ముగిసింది. పలు సందర్భాల్లో ఈ Read more