dronpak

India – Pakistan War : మరోసారి పాక్ డ్రోన్ అటాక్

భారత సరిహద్దుల్లో పరిస్థితులు క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ మళ్లీ మరోసారి దుర్మార్గానికి పాల్పడింది. ఇప్పటికే భారత భూభాగంలోని 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసిన పాక్, తెల్లవారుజామున జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలోని పలు ప్రాంతాలపై మళ్లీ డ్రోన్లతో దాడికి యత్నించింది. ఈసారి అవి సాయుధ డ్రోన్లు కావడం ఆందోళనకరం.

Advertisements

దాడి లక్ష్యంగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా బ్లాక్ అవుట్

ఈ యత్నాన్ని ముందుగానే గుర్తించిన భారత రక్షణ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాడి లక్ష్యంగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా బ్లాక్ అవుట్ ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వాహనాల కదలికలను నిలిపేశారు. రాడార్ మరియు నైట్ విజన్ సిస్టంల సహాయంతో పాక్ డ్రోన్ల చలనం గుర్తించి, వాటిని గాల్లోనే ధ్వంసం చేయడంలో భారత ఆర్మీ విజయం సాధించింది.

పాక్ వరుస డ్రోన్ దాడులు

పాక్ వరుస డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారత భద్రతా బలగాలు అన్ని రంగాల్లో అప్రమత్తంగా ఉండి, మరింత కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇటువంటి దాడుల పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుండగా, పౌరులకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. పాక్ ఈ తీరుతో ముందుకు సాగితే తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలసి ఉంటుందని కేంద్రం హెచ్చరించింది.

Read Also : Airports : దేశంలో 32 ఎయిర్పోర్టులు మూసివేత

Related Posts
మిడ్ మానేరు నిర్వాసితులకు గుడ్ న్యూస్
Good news for Mid Maneru re

మిడ్ మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్ తెలిపింది. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడి ద్వారకానగరం సముద్ర గర్భంలో మునిగిపోయినట్టు… నేటి కలియుగంలో జననివాసాలు మిడ్ మానేరులో మునిగిపోయాయి. Read more

జగన్ కు షాక్ ఇచ్చిన మరో కీలక నేత
avanthi srinivas resigns ycp

గత ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రస్తుతం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన పార్టీని, పలువురు కీలక Read more

Pope Francis: లక్షలాది మంది భక్తుల సమక్షంలో పోప్ అంత్యక్రియలు
Pope Francis: లక్షలాది మంది భక్తుల సమక్షంలో పోప్ అంత్యక్రియలు

పోప్ ఫ్రాన్సిస్‌కు ప్రపంచం వీడ్కోలు - శ్రద్ధాంజలి సభలో ప్రముఖుల సందడి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ ఓ అనుభూతి క్షేత్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది Read more

Pakistan On PM Modi Speech: కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నాం: పాక్
కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నాం: పాక్

పహల్గాం (Pahalgam) ఉగ్రదాడికి స్పందనగా భారత ప్రభుత్వం "ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) పేరిట పాక్‌ (Pak)పై చర్యలు ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×